India: రూ. 6 లక్షలకన్నా విలువైన నగలు కొన్నారా?: కేంద్రం ఓ కన్నేసింది జాగ్రత్త!

షార్ట్స్‌లో చూడండి
నల్లధనం చలామణిని, మనీలాండరింగ్ ను అరికట్టేందుకు కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎవరైనా రూ. 6 లక్షలకు పైగా విలువైన నగలు లేదా విలాస వస్తువులను కొనుగోలు చేస్తే, ఆ లావాదేవీలను విచారించాలని ఆదాయపు పన్ను శాఖతో పాటు రెవెన్యూ, ఇంటెలిజెన్స్ ఏజన్సీలను కేంద్రం ఆదేశించింది. ఈ తరహా లావాదేవీలను పరిశీలించాలని, అవకతవకలు కనిపిస్తే, కేసులు పెట్టి విచారించాలని కేంద్ర నిఘా విభాగాల అధికారులకు ఆదేశాలు అందాయి.

 బినామీ లావాదేవీలు నిర్వహిస్తూ, అక్రమంగా డబ్బు చలామణి చేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించిన కేంద్రం, నగదు లావాదేవీలు రూ. 2 లక్షలకు మించరాదని, రూ. 50 వేలకు పైగా జరిపే లావాదేవీలకు పాన్ నంబరు తప్పనిసరని ఆదేశించిన సంగతి తెలిసిందే. తాజాగా రూ. 6 లక్షలకు మించిన అన్ని కొనుగోళ్లనూ పరిశీలించాలని అధికారులకు సూచించింది. ఇక రూ. 50 లక్షలకు పైగా జరిపిన ఆస్తుల కొనుగోళ్లను కూడా ఐటీ శాఖ పరిశీలించనుంది.
Go Back to Shorts
India
Gold
Black Money
Central Government

More Telugu News