అమెరికాలోని మన్‌హట్టన్‌లో ఉగ్రదాడి.. బాంబు పేల్చడంలో విఫలమై గాయాలపాలైన ఉగ్రవాది!

  • ఉగ్రవాది ఐసిస్ సానుభూతిపరుడు
  • బంగ్లాదేశ్‌కు చెందిన అఖాయెద్ ఉల్లాగా గుర్తింపు
  • ఏడేళ్లుగా అమెరికాలో నివాసం
  • పనిచేస్తున్న కంపెనీలోనే బాంబు తయారీ
అమెరికాలోని మన్‌హట్టన్‌లోని ఓ బస్ టెర్మినల్ వద్ద సోమవారం సాయంత్రం జరిగిన ఆత్మాహుతి దాడికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దాడి వెనక ఉగ్రవాద సంస్థ ఐసిస్ హస్తం ఉన్నట్టు న్యూయార్క్ పోలీసులు అనుమానిస్తున్నారు. మన్‌హట్టన్‌ 42వ వీధిలోని ఎనిమిదో అవెన్యూ బస్ టెర్మినల్ వద్ద ఈ దాడి జరగ్గా, పేలుడు అనంతరం ఆ సమీపంలో తీవ్ర గాయాలతో పడి ఉన్న వ్యక్తిని గుర్తించిన పోలీసులు అతడి దగ్గరికి వెళ్లి చూడగా అనుమానాస్పదంగా కనిపించాడు. అతడు ధరించిన జాకెట్లో వైర్లు ఉండడంతో అదుపులోకి తీసుకున్నారు. దాడికి పాల్పడింది అతడేనని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఉగ్రవాదిగా అనుమానిస్తున్న అతడిని బంగ్లాదేశ్‌కు చెందిన అఖాయెద్ ఉల్లాగా గుర్తించారు. ఐసిస్‌ సానుభూతి పరుడు అయిన అతడు ఏడేళ్లుగా అమెరికాలోనే ఉంటున్నాడు. ఉల్లా తాను పనిచేస్తున్న ఎలక్ట్రిక్ కంపెనీలో బాంబును తయారు చేసినట్టు విచారణలో వెల్లడైంది. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం సోమవారం ఉదయం జాకెట్‌లో బాంబు పెట్టుకుని బస్ టెర్మినల్ వద్దకు చేరుకున్న ఉల్లా బాంబును పేల్చడంలో విఫలమయ్యాడు. దీంతో బాంబు సరిగా పేలలేదు సరికదా, ఉల్లా గాయపడ్డాడు. ఈ ఘటనలో గాయపడిన మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Go Back to Shorts
America
manhattan
Bomb Blast
Bangladesh

More Telugu News