jeevita rajasekhar: మాకు ఎవరూ లేరనుకున్నాం .. అందరూ అండగా నిలిచారు!: జీవిత రాజశేఖర్

షార్ట్స్‌లో చూడండి
రాజశేఖర్ కథానాయకుడిగా వచ్చిన 'గరుడ వేగ' సినిమాకి, విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. రోజు రోజుకి వసూళ్లు పుంజుకుంటూ ఉండటం ఈ సినిమా టీమ్ కి ఆనందాన్ని కలిగిస్తోంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీమ్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఈ వేదికపై జీవిత చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. ఈ సినిమా సక్సెస్ కి కారకులైన వారికి థ్యాంక్స్ అనే ఒక మాట చెబితే సరిపోదని అన్నారు.

 ఒక్క ఫోన్ కాల్ చేసి .. ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయమని అడగ్గానే రానా .. కాజల్ .. తాప్సి .. మంచు లక్ష్మీ అంగీకరించడం విశేషమని చెప్పారు. ఇక ట్రైలర్ లాంచ్ చేయడానికి రావలసిందిగా బాలకృష్ణ గారిని కోరితే, స్వయంగా ముహూర్తం పెట్టిమరీ ట్రైలర్ ను లాంచ్ చేశారని అన్నారు. ఈ సినిమా విడుదల తరువాత చిరంజీవి .. మహేశ్ బాబు ఫోన్ చేసి రాజశేఖర్ కి అభినందనలు తెలిపారని చెప్పారు. మాకెవరూ లేరనుకున్నామనీ, కానీ అందరూ తమకి అండగా నిలిచారంటూ ఆమె ఉద్వేగానికి లోనయ్యారు.  
Go Back to Shorts
jeevita rajasekhar

More Telugu News