ఐలయ్యా... పచ్చగా ఉన్న తెలంగాణలో ఈ చిచ్చేంటయ్యా?: విరుచుకుపడ్డ టీఆర్ఎస్ నేతలు
- సామాజిక ఉగ్రవాది ఐలయ్య: బాల్క సుమన్
- కులాల మధ్య చిచ్చు పెట్టే పుస్తకాలెందుకు: శ్రీనివాస్ గౌడ్
- విదేశీ ఏజంట్ లా మారిన ఐలయ్య: బిగాల గణేష్
కులాలు, మతాల మధ్య విభేదాలు సృష్టించేలా పుస్తకాలు రాయడమేంటని ప్రశ్నించిన శ్రీనివాస్ గౌడ్, ఆయన తన పుస్తకాన్ని స్వచ్ఛందంగా ఉపసంహరించుకోవాలని కోరారు. బాల్క సుమన్ మాట్లాడుతూ, సమస్యకు సామరస్యంగా ముగింపు పలికితే బాగుంటుందని సూచించారు. ఈ మేరకు ఐలయ్యే, వైశ్య సంఘాల ప్రతినిధులతో మాట్లాడాలని తెలిపారు. ఇదే సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే బిగాల గణేష్, తనకు ప్రాణహాని ఉందంటూ ఐలయ్య రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. ఆయన ఓ విదేశీ ఏజంట్ లా మారిపోయారని ఆరోపించారు. కాగా, తన రచనలో వైశ్య వర్గాల వారిని ఐలయ్య అవమానించారంటూ వైశ్య సంఘాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.