ఛైర్మన్గా చంద్రశేఖరన్ను నోయెల్ టాటా ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?
- చంద్రశేఖరన్కు మరో ఐదేళ్లు ఛైర్మన్ పదవి
- నిర్ణయంపై నోయెల్ టాటా అభ్యంతరం
- తప్పుకోవాలని చంద్రశేఖరనే నిర్ణయించుకున్నారన్న నోయెల్
- చంద్రశేఖరన్ డైరెక్టర్ పదవిపైనా సందేహం
- నిర్ణయంపై న్యాయపరమైన సవాల్ రావొచ్చన్న హెచ్చరిక
టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ మరో ఐదేళ్లు కొనసాగేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. అయితే ఈ నిర్ణయంపై టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ నోయెల్ టాటా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రశేఖరన్ స్వయంగా పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారని, ఆ నిర్ణయాన్ని తాము అంగీకరించామని ఆయన స్పష్టం చేశారు.
చంద్రశేఖరన్ ఆగస్టు 12న తన పదవీకాలం ముగిసిన తర్వాత మళ్లీ ఛైర్మన్గా కొనసాగేందుకు ఆసక్తి లేదని బోర్డుకు తెలిపారు. ఆయన ప్రస్తుత పదవీకాలం 2027 ఫిబ్రవరి 20తో ముగియనుంది. అయితే గురువారం జరిగిన టాటా సన్స్ బోర్డు సమావేశంలో చంద్రశేఖరన్ను మరో ఐదేళ్లకు ఛైర్మన్గా కొనసాగించాలని నిర్ణయించారు.
ఈ నిర్ణయాన్ని నోయెల్ టాటా ప్రశ్నించారు. చంద్రశేఖరన్ తప్పుకోవాలన్న నిర్ణయం ఆయన స్వయంగా తీసుకున్నదేనని చెప్పారు. బోర్డు ఆయనపై ఒత్తిడి చేయలేదని, ఎలాంటి తీర్మానం చేయలేదని తెలిపారు. ఆ నిర్ణయం బహిరంగంగా ప్రకటించిన తర్వాత ఉద్యోగులు, రుణదాతలు, వ్యాపార భాగస్వాములు, మార్కెట్ అంతా దానిని పరిగణనలోకి తీసుకున్నారని అన్నారు.
టాటా సన్స్లో సుమారు 66 శాతం వాటా టాటా ట్రస్ట్స్ వద్ద ఉంది. చంద్రశేఖరన్ తప్పుకోవాలన్న నిర్ణయాన్ని ట్రస్ట్స్ కూడా అంగీకరించాయని నోయెల్ చెప్పారు. అందువల్ల ఇప్పుడు ఆయన్ని నియమించడాన్ని ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలను పక్కన పెట్టినట్టేనని అభిప్రాయపడ్డారు.
మరో కీలక అంశాన్ని కూడా నోయెల్ లేవనెత్తారు. టాటా సన్స్ ఛైర్మన్ పదవి చేపట్టేది కంపెనీ డైరెక్టరే కావాలని, కానీ చంద్రశేఖరన్ డైరెక్టర్గా కొనసాగడంపై ప్రస్తుతం స్పష్టత లేదని చెప్పారు. ఆయన డైరెక్టర్ పదవిపై నిర్ణయం తీసుకోవాల్సిన సమావేశం కోరం లేక వాయిదా పడిందని గుర్తుచేశారు.
డైరెక్టర్ పదవి ఇంకా తేలకముందే ఛైర్మన్ పదవిపై నిర్ణయం తీసుకోవడం సరైన పద్ధతి కాదని నోయెల్ అన్నారు. భవిష్యత్తులో ఈ నిర్ణయంపై ఏదైనా వాటాదారు న్యాయపరమైన సవాల్ చేసే అవకాశం ఉందని కూడా హెచ్చరించారు.
చంద్రశేఖరన్ ఆగస్టు 12న తన పదవీకాలం ముగిసిన తర్వాత మళ్లీ ఛైర్మన్గా కొనసాగేందుకు ఆసక్తి లేదని బోర్డుకు తెలిపారు. ఆయన ప్రస్తుత పదవీకాలం 2027 ఫిబ్రవరి 20తో ముగియనుంది. అయితే గురువారం జరిగిన టాటా సన్స్ బోర్డు సమావేశంలో చంద్రశేఖరన్ను మరో ఐదేళ్లకు ఛైర్మన్గా కొనసాగించాలని నిర్ణయించారు.
ఈ నిర్ణయాన్ని నోయెల్ టాటా ప్రశ్నించారు. చంద్రశేఖరన్ తప్పుకోవాలన్న నిర్ణయం ఆయన స్వయంగా తీసుకున్నదేనని చెప్పారు. బోర్డు ఆయనపై ఒత్తిడి చేయలేదని, ఎలాంటి తీర్మానం చేయలేదని తెలిపారు. ఆ నిర్ణయం బహిరంగంగా ప్రకటించిన తర్వాత ఉద్యోగులు, రుణదాతలు, వ్యాపార భాగస్వాములు, మార్కెట్ అంతా దానిని పరిగణనలోకి తీసుకున్నారని అన్నారు.
టాటా సన్స్లో సుమారు 66 శాతం వాటా టాటా ట్రస్ట్స్ వద్ద ఉంది. చంద్రశేఖరన్ తప్పుకోవాలన్న నిర్ణయాన్ని ట్రస్ట్స్ కూడా అంగీకరించాయని నోయెల్ చెప్పారు. అందువల్ల ఇప్పుడు ఆయన్ని నియమించడాన్ని ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలను పక్కన పెట్టినట్టేనని అభిప్రాయపడ్డారు.
మరో కీలక అంశాన్ని కూడా నోయెల్ లేవనెత్తారు. టాటా సన్స్ ఛైర్మన్ పదవి చేపట్టేది కంపెనీ డైరెక్టరే కావాలని, కానీ చంద్రశేఖరన్ డైరెక్టర్గా కొనసాగడంపై ప్రస్తుతం స్పష్టత లేదని చెప్పారు. ఆయన డైరెక్టర్ పదవిపై నిర్ణయం తీసుకోవాల్సిన సమావేశం కోరం లేక వాయిదా పడిందని గుర్తుచేశారు.
డైరెక్టర్ పదవి ఇంకా తేలకముందే ఛైర్మన్ పదవిపై నిర్ణయం తీసుకోవడం సరైన పద్ధతి కాదని నోయెల్ అన్నారు. భవిష్యత్తులో ఈ నిర్ణయంపై ఏదైనా వాటాదారు న్యాయపరమైన సవాల్ చేసే అవకాశం ఉందని కూడా హెచ్చరించారు.