‘నన్ను ప్రశాంతంగా చనిపోనివ్వండి’.. నటి ట్విషా శర్మ చివరి సందేశం
- నటి ట్విషా శర్మ ఆత్మహత్య కేసులో సీబీఐ చార్జిషీట్ దాఖలు
- భర్త సమర్థ్ సింగ్, అత్త గిరిబాల సింగ్పై తీవ్ర అభియోగాలు
- మరణానికి ముందు తల్లిదండ్రులకు ఫోన్ చేసి భర్త తీరుపై ఆవేదన
- ఉరి వేసుకోవడం వల్లే మరణించినట్లు పోస్టుమార్టం నివేదికలో నిర్ధారణ
మాజీ మోడల్, నటి ట్విషా శర్మ ఆత్మహత్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కీలక వివరాలను వెల్లడించింది. భోపాల్ కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్లో ట్విష మరణించడానికి ముందు చివరి గంటల్లో పంపిన సందేశాలు, ఫోన్ కాల్స్ వివరాలను పొందుపరిచింది. ఆమె భర్త సమర్థ్ సింగ్, రిటైర్డ్ జిల్లా జడ్జి అయిన అత్త గిరిబాల సింగ్లపై మానసిక వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించడం వంటి అభియోగాలను సీబీఐ నమోదు చేసింది.
చార్జిషీట్ ప్రకారం.. 2026 మే 12వ తేదీ రాత్రి 9:36 గంటలకు ట్విష తన ఆడపడుచు రాశి అబ్రోల్కు ఒక వాట్సాప్ సందేశం పంపారు. "మీ అన్నయ్యను తన భార్య అవశేషాలను తీసుకెళ్లమని చెప్పు.. కానీ రేపు. ప్రస్తుతానికి నన్ను ప్రశాంతంగా చనిపోనివ్వండి" అని ఆ మెసేజ్లో పేర్కొన్నారు. అంతకుముందు కూడా ఆమె తన వైవాహిక జీవితంలోని సమస్యల గురించి ఫోన్లో మాట్లాడినట్లు సీబీఐ తెలిపింది.
రాత్రి 9:40 గంటల సమయంలో ట్విష ఒంటరిగా టెర్రస్ వైపు నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు నివాసంలోని సీసీటీవీ ఫుటేజ్లో రికార్డయ్యాయి. సరిగ్గా 9:41 గంటలకు ఆమె తన తండ్రికి వాట్సాప్ కాల్ చేసి, భర్త తనపై దూకుడుగా ప్రవర్తిస్తున్నాడని చెబుతూ కన్నీరు పెట్టుకున్నారు. వెంటనే భోపాల్కు రావాలని కుటుంబ సభ్యులను కోరారు. ఆమె చివరిగా రాత్రి 10:05 గంటలకు తన తల్లి రేఖా రాణి శర్మకు ఫోన్ చేసి, మళ్లీ భర్త తీరుపై ఆవేదన వ్యక్తం చేసిన కొద్దిసేపటికే కాల్ కట్ అయింది.
ఆ తర్వాత ఆమె తల్లి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ట్విష స్పందించలేదు. భర్త సమర్థ్, అత్త గిరిబాలకు ఫోన్ చేసినా మొదట సమాధానం రాలేదు. కాసేపటికి కుటుంబ సభ్యులు టెర్రస్పైకి వెళ్లగా, అపస్మారక స్థితిలో ఉన్న ట్విషను గుర్తించారు. వెంటనే భోపాల్ ఎయిమ్స్కు తరలించగా, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
భోపాల్ ఎయిమ్స్తో పాటు ఢిల్లీ ఎయిమ్స్ మెడికల్ బోర్డు నిర్వహించిన పోస్టుమార్టం నివేదిక ప్రకారం, ఉరి వేసుకోవడం వల్ల ఊపిరాడక ట్విష మరణించిందని, ఇది ఆత్మహత్యేనని నిర్ధారించారు. మరణానికి ముందు ఆమెపై ఎలాంటి దాడి జరగలేదని నివేదిక స్పష్టం చేసింది. గత కొంతకాలంగా ట్విష ఎదుర్కొన్న మానసిక వేధింపులకు సంబంధించిన డిజిటల్ ఆధారాలను సీబీఐ కోర్టుకు సమర్పించింది. ప్రస్తుతం నిందితులిద్దరూ జ్యుడీషియల్ కస్టడీలో ఉండగా, కేసు విచారణ కొనసాగుతోంది.
చార్జిషీట్ ప్రకారం.. 2026 మే 12వ తేదీ రాత్రి 9:36 గంటలకు ట్విష తన ఆడపడుచు రాశి అబ్రోల్కు ఒక వాట్సాప్ సందేశం పంపారు. "మీ అన్నయ్యను తన భార్య అవశేషాలను తీసుకెళ్లమని చెప్పు.. కానీ రేపు. ప్రస్తుతానికి నన్ను ప్రశాంతంగా చనిపోనివ్వండి" అని ఆ మెసేజ్లో పేర్కొన్నారు. అంతకుముందు కూడా ఆమె తన వైవాహిక జీవితంలోని సమస్యల గురించి ఫోన్లో మాట్లాడినట్లు సీబీఐ తెలిపింది.
రాత్రి 9:40 గంటల సమయంలో ట్విష ఒంటరిగా టెర్రస్ వైపు నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు నివాసంలోని సీసీటీవీ ఫుటేజ్లో రికార్డయ్యాయి. సరిగ్గా 9:41 గంటలకు ఆమె తన తండ్రికి వాట్సాప్ కాల్ చేసి, భర్త తనపై దూకుడుగా ప్రవర్తిస్తున్నాడని చెబుతూ కన్నీరు పెట్టుకున్నారు. వెంటనే భోపాల్కు రావాలని కుటుంబ సభ్యులను కోరారు. ఆమె చివరిగా రాత్రి 10:05 గంటలకు తన తల్లి రేఖా రాణి శర్మకు ఫోన్ చేసి, మళ్లీ భర్త తీరుపై ఆవేదన వ్యక్తం చేసిన కొద్దిసేపటికే కాల్ కట్ అయింది.
ఆ తర్వాత ఆమె తల్లి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ట్విష స్పందించలేదు. భర్త సమర్థ్, అత్త గిరిబాలకు ఫోన్ చేసినా మొదట సమాధానం రాలేదు. కాసేపటికి కుటుంబ సభ్యులు టెర్రస్పైకి వెళ్లగా, అపస్మారక స్థితిలో ఉన్న ట్విషను గుర్తించారు. వెంటనే భోపాల్ ఎయిమ్స్కు తరలించగా, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
భోపాల్ ఎయిమ్స్తో పాటు ఢిల్లీ ఎయిమ్స్ మెడికల్ బోర్డు నిర్వహించిన పోస్టుమార్టం నివేదిక ప్రకారం, ఉరి వేసుకోవడం వల్ల ఊపిరాడక ట్విష మరణించిందని, ఇది ఆత్మహత్యేనని నిర్ధారించారు. మరణానికి ముందు ఆమెపై ఎలాంటి దాడి జరగలేదని నివేదిక స్పష్టం చేసింది. గత కొంతకాలంగా ట్విష ఎదుర్కొన్న మానసిక వేధింపులకు సంబంధించిన డిజిటల్ ఆధారాలను సీబీఐ కోర్టుకు సమర్పించింది. ప్రస్తుతం నిందితులిద్దరూ జ్యుడీషియల్ కస్టడీలో ఉండగా, కేసు విచారణ కొనసాగుతోంది.