'సేవ్ అమెరికా' చట్టం కోసం పట్టు.. భారత్ను చూసి నేర్చుకోవాలన్న ట్రంప్
- 'సేవ్ అమెరికా' చట్టం కోసం పట్టుబడుతున్న డొనాల్డ్ ట్రంప్
- అమెరికా ఎన్నికల్లోనూ ఓటర్ ఐడీ తప్పనిసరి చేయాలని డిమాండ్
- భారత ఎన్నికల వ్యవస్థను, ఓటర్ ఐడీ విధానాన్ని ఉదహరించిన ట్రంప్
- భారత సీఈసీ తనను ప్రశ్నించినట్లు సోషల్ మీడియాలో పోస్ట్
- భారత్లో 64.6 కోట్ల మంది ఓటర్ ఐడీతోనే ఓటు వేశారని వెల్లడి
దేశంలో ఎన్నికల సంస్కరణల కోసం తాను ప్రతిపాదించిన 'సేవ్ అమెరికా చట్టం' ఆమోదం పొందడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఎన్నికల వ్యవస్థను ఉదాహరణగా చూపారు. అమెరికా ఫెడరల్ ఎన్నికలలో ఓటు వేయడానికి కఠినమైన ఫోటో గుర్తింపు కార్డు (ఓటర్ ఐడీ), పౌరసత్వ ధ్రువీకరణ తప్పనిసరి చేయాలని ఆయన మరోసారి డిమాండ్ చేశారు.
సోమవారం తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'ట్రూత్ సోషల్' వేదికగా ట్రంప్ ఒక పోస్ట్ చేశారు. "గుర్తింపు కార్డు లేకుండా అమెరికాలో ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఈ మధ్య నన్ను ప్రశ్నించారు" అని ట్రంప్ అందులో పేర్కొన్నారు. ఇటీవల ముగిసిన భారత సార్వత్రిక ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ.. 64.6 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని, వారిలో ప్రతి ఒక్కరూ ఫొటో గుర్తింపు కార్డు చూపించారని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసిన వారు ఒక శాతం కంటే తక్కువేనని ఆయన గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో "మనం తక్షణమే 'సేవ్ అమెరికా చట్టాన్ని' ఆమోదించాలి" అని ట్రంప్ పిలుపునిచ్చారు.
'సేఫ్గార్డ్ అమెరికన్ ఓటర్ ఎలిజిబిలిటీ యాక్ట్'గా పిలిచే ఈ బిల్లు ప్రకారం, ఫెడరల్ ఎన్నికల్లో ఓటు నమోదు చేసుకోవడానికి పౌరసత్వానికి సంబంధించిన పత్రాలను సమర్పించాలి. ఓటు వేసేటప్పుడు తప్పనిసరిగా ఫొటో ఐడీ చూపించాలి. మెయిల్-ఇన్ ఓటింగ్పై కూడా కఠిన నిబంధనలు ఉంటాయి. ఈ బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభలో ఆమోదం లభించినా, సెనెట్లో మాత్రం ముందుకు కదల్లేదు. ప్రస్తుతం సెనెట్ విరామంలో ఉంది.
భారత్, బ్రెజిల్ వంటి దేశాలు ఓటర్ గుర్తింపును బయోమెట్రిక్ లేదా ఇతర ధ్రువీకరణ వ్యవస్థలతో అనుసంధానించాయని, కానీ అమెరికాలో మాత్రం పౌరసత్వం విషయంలో స్వీయ ధ్రువీకరణపైనే ఆధారపడుతున్నామని వైట్ హౌస్ గతంలోనే పేర్కొంది. ఎన్నికల సమగ్రతను కాపాడటానికి ఈ సంస్కరణలు అవసరమని ట్రంప్ చాలాకాలంగా వాదిస్తున్నారు.
సోమవారం తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'ట్రూత్ సోషల్' వేదికగా ట్రంప్ ఒక పోస్ట్ చేశారు. "గుర్తింపు కార్డు లేకుండా అమెరికాలో ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఈ మధ్య నన్ను ప్రశ్నించారు" అని ట్రంప్ అందులో పేర్కొన్నారు. ఇటీవల ముగిసిన భారత సార్వత్రిక ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ.. 64.6 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని, వారిలో ప్రతి ఒక్కరూ ఫొటో గుర్తింపు కార్డు చూపించారని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసిన వారు ఒక శాతం కంటే తక్కువేనని ఆయన గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో "మనం తక్షణమే 'సేవ్ అమెరికా చట్టాన్ని' ఆమోదించాలి" అని ట్రంప్ పిలుపునిచ్చారు.
'సేఫ్గార్డ్ అమెరికన్ ఓటర్ ఎలిజిబిలిటీ యాక్ట్'గా పిలిచే ఈ బిల్లు ప్రకారం, ఫెడరల్ ఎన్నికల్లో ఓటు నమోదు చేసుకోవడానికి పౌరసత్వానికి సంబంధించిన పత్రాలను సమర్పించాలి. ఓటు వేసేటప్పుడు తప్పనిసరిగా ఫొటో ఐడీ చూపించాలి. మెయిల్-ఇన్ ఓటింగ్పై కూడా కఠిన నిబంధనలు ఉంటాయి. ఈ బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభలో ఆమోదం లభించినా, సెనెట్లో మాత్రం ముందుకు కదల్లేదు. ప్రస్తుతం సెనెట్ విరామంలో ఉంది.
భారత్, బ్రెజిల్ వంటి దేశాలు ఓటర్ గుర్తింపును బయోమెట్రిక్ లేదా ఇతర ధ్రువీకరణ వ్యవస్థలతో అనుసంధానించాయని, కానీ అమెరికాలో మాత్రం పౌరసత్వం విషయంలో స్వీయ ధ్రువీకరణపైనే ఆధారపడుతున్నామని వైట్ హౌస్ గతంలోనే పేర్కొంది. ఎన్నికల సమగ్రతను కాపాడటానికి ఈ సంస్కరణలు అవసరమని ట్రంప్ చాలాకాలంగా వాదిస్తున్నారు.