ఢిల్లీలో ప్రధానితో గోవా గవర్నర్ సమావేశం .. సింహాద్రి అప్పన్న దర్శనానికి ఆహ్వానం
- ప్రధాని మోదీతో గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు భేటీ
- సింహాద్రి అప్పన్న దర్శనానికి రావాలని ప్రధానికి ఆహ్వానం
- మోదీకి సింహాచలం నారసింహుని ప్రతిమను అందించిన రాజు
- దర్శనానికి వస్తానని ప్రధాని సూచించినట్లు వెల్లడి
- గోవా అభివృద్ధి కార్యక్రమాలపై ప్రధానికి వివరణ
గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు సోమవారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి (సింహాద్రి అప్పన్న) దర్శనార్థం రావాల్సిందిగా ఆయన ప్రధానిని సాదరంగా ఆహ్వానించారు.
గోవా గవర్నర్గా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన నేపథ్యంలో అశోక్ గజపతి రాజు ప్రధానిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో సింహాద్రి అప్పన్న స్వామివారి ప్రతిమను ఆయన ప్రధాని మోదీకి బహూకరించారు. ఆలయ ట్రస్ట్ తరఫున తాను ఈ ఆహ్వానాన్ని అందించినట్లు ఆయన పేర్కొన్నారు.
తన ఆహ్వానంపై ప్రధాని సానుకూలంగా స్పందించారని, త్వరలోనే స్వామివారిని దర్శించుకుంటానని హామీ ఇచ్చినట్లు అశోక్ గజపతి రాజు వెల్లడించారు. ఈ భేటీలో గోవాలో కొనసాగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ ప్రాజెక్టుల పురోగతిని కూడా ఆయన ప్రధాని మోదీకి వివరించారు.
గోవా గవర్నర్గా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన నేపథ్యంలో అశోక్ గజపతి రాజు ప్రధానిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో సింహాద్రి అప్పన్న స్వామివారి ప్రతిమను ఆయన ప్రధాని మోదీకి బహూకరించారు. ఆలయ ట్రస్ట్ తరఫున తాను ఈ ఆహ్వానాన్ని అందించినట్లు ఆయన పేర్కొన్నారు.
తన ఆహ్వానంపై ప్రధాని సానుకూలంగా స్పందించారని, త్వరలోనే స్వామివారిని దర్శించుకుంటానని హామీ ఇచ్చినట్లు అశోక్ గజపతి రాజు వెల్లడించారు. ఈ భేటీలో గోవాలో కొనసాగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ ప్రాజెక్టుల పురోగతిని కూడా ఆయన ప్రధాని మోదీకి వివరించారు.