స్వరం లేదు.. సంగీతం లేదు.. కానీ వీరి ‘జనగణమన’ విని కన్నీళ్లు పెట్టుకున్న దేశం!
- మాటలు లేకుండానే ‘జనగణమన’ను ఆవిష్కరించిన చిన్నారులు
- దాదాపు 500 మంది ప్ర్యతేక అవసరాలు ఉన్న పిల్లలు పాల్గొన్న వైనం
- సంకేత భాషలో జాతీయ గీతాన్ని ప్రదర్శించిన చిన్నారులు
- ‘దేశభక్తికి భాష లేదు’ అనే ఆలోచనతో ప్రచారం
- భావోద్వేగంతో ప్రేక్షకులను కంటతడి పెట్టించిన మౌన గీతం
- కాన్స్ లయన్స్లో ఒక సిల్వర్, రెండు బ్రాంజ్ అవార్డులు
దేశభక్తికి భాష అవసరం లేదు.. గుండెల్లో దేశం ఉంటే చాలు. జాతీయ గీతం వినిపించకపోయినా ప్రతి హృదయంలో మార్మోగొచ్చు. మాటలు పలకలేని చిన్నారులు చేతులతో ‘జనగణమన’ను ఆవిష్కరించిన ఆ క్షణం.. దేశభక్తికి కొత్త అర్థం చెప్పింది. దాదాపు 500 మంది చిన్నారులు ఒక్కసారిగా తమ చేతులను కదిలిస్తుంటే.. సంగీతం, శబ్దం లేకపోయినా దేశభక్తి మార్మోగింది. ప్రతి కదలికలో భారత్ కనిపించింది. ప్రేక్షకుల కళ్లలో నీళ్లు తెప్పించిన ఆ మౌన గీతం.. దేశభక్తికి అసలు స్వరం హృదయమేనని చాటిచెప్పింది.
ముద్రా గ్రూప్.. బిగ్ సినిమాస్ కోసం 2011లో రూపొందించిన ‘ది సైలెంట్ నేషనల్ ఆంథమ్’ ప్రచారం వెనుక ఈ అద్భుతమైన ఆలోచన ఉంది. ‘‘దేశభక్తికి భాష లేదు’’ అంటూ బాబీ పవార్ ఆలోచన నుంచి ఈ ప్రయోగం పుట్టింది. సాధారణంగా జాతీయ గీతాన్ని వింటాం. కానీ ఈసారి దాన్ని వినకుండా చూడాల్సి వచ్చింది. వినికిడి, మాటల లోపం ఉన్న చిన్నారులు సంకేత భాషలో ‘జనగణమన’ను ప్రదర్శించారు.
ముంబయిలోని ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు చెందిన 8 పాఠశాలల్లోని దాదాపు 500 మంది చిన్నారులు ఇందులో పాల్గొన్నారు. ప్రతి చిన్నారి చేతి కదలికలో ఓ భావం కనిపించింది. ప్రతి చూపులో ఓ గర్వం ప్రస్పుటమైంది. ప్రతి సంకేతంలో ‘నేను భారతీయుడిని’ అనే మాట వినిపించింది. వారి గొంతులు వినిపించకపోయినా.. వారి దేశభక్తి మాత్రం ప్రేక్షకుల హృదయాలను తాకింది. థియేటర్లో ఆ దృశ్యాన్ని చూసిన చాలామంది కన్నీళ్లు ఆపుకోలేకపోయారు.
ఈ ప్రచారంలో పెద్ద పెద్ద మాటలు లేవు. భారీ హంగులు లేవు. కేవలం నిర్మలమైన చిన్నారులు.. నిజమైన భావోద్వేగం.. కొన్ని చేతి కదలికలు మాత్రమే ఉన్నాయి. అదే దాని బలంగా మారింది. దేశభక్తిని వినిపించకుండా అనుభూతి చెందేలా చేసిన ఈ ఆలోచన ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. కాన్స్ లయన్స్లో ఒక సిల్వర్, రెండు బ్రాంజ్ అవార్డులను సొంతం చేసుకుంది.
ఆ మౌనం ఓ సందేశంగా మారింది. దేశం అంటే కేవలం వినిపించే గీతం కాదు.. అనుభూతి చెందే భావం అని చెప్పింది. స్వరం లేకపోయినా దేశభక్తి ఉంటుంది. మాటలు లేకపోయినా ప్రేమ ఉంటుంది. ఆ చిన్నారుల చేతుల్లో కదిలిన ‘జనగణమన’.. భారత మాతపై ప్రేమకు శబ్దం అవసరం లేదని ప్రపంచానికి చాటి చెప్పింది.
ముద్రా గ్రూప్.. బిగ్ సినిమాస్ కోసం 2011లో రూపొందించిన ‘ది సైలెంట్ నేషనల్ ఆంథమ్’ ప్రచారం వెనుక ఈ అద్భుతమైన ఆలోచన ఉంది. ‘‘దేశభక్తికి భాష లేదు’’ అంటూ బాబీ పవార్ ఆలోచన నుంచి ఈ ప్రయోగం పుట్టింది. సాధారణంగా జాతీయ గీతాన్ని వింటాం. కానీ ఈసారి దాన్ని వినకుండా చూడాల్సి వచ్చింది. వినికిడి, మాటల లోపం ఉన్న చిన్నారులు సంకేత భాషలో ‘జనగణమన’ను ప్రదర్శించారు.
ముంబయిలోని ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు చెందిన 8 పాఠశాలల్లోని దాదాపు 500 మంది చిన్నారులు ఇందులో పాల్గొన్నారు. ప్రతి చిన్నారి చేతి కదలికలో ఓ భావం కనిపించింది. ప్రతి చూపులో ఓ గర్వం ప్రస్పుటమైంది. ప్రతి సంకేతంలో ‘నేను భారతీయుడిని’ అనే మాట వినిపించింది. వారి గొంతులు వినిపించకపోయినా.. వారి దేశభక్తి మాత్రం ప్రేక్షకుల హృదయాలను తాకింది. థియేటర్లో ఆ దృశ్యాన్ని చూసిన చాలామంది కన్నీళ్లు ఆపుకోలేకపోయారు.
ఈ ప్రచారంలో పెద్ద పెద్ద మాటలు లేవు. భారీ హంగులు లేవు. కేవలం నిర్మలమైన చిన్నారులు.. నిజమైన భావోద్వేగం.. కొన్ని చేతి కదలికలు మాత్రమే ఉన్నాయి. అదే దాని బలంగా మారింది. దేశభక్తిని వినిపించకుండా అనుభూతి చెందేలా చేసిన ఈ ఆలోచన ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. కాన్స్ లయన్స్లో ఒక సిల్వర్, రెండు బ్రాంజ్ అవార్డులను సొంతం చేసుకుంది.
ఆ మౌనం ఓ సందేశంగా మారింది. దేశం అంటే కేవలం వినిపించే గీతం కాదు.. అనుభూతి చెందే భావం అని చెప్పింది. స్వరం లేకపోయినా దేశభక్తి ఉంటుంది. మాటలు లేకపోయినా ప్రేమ ఉంటుంది. ఆ చిన్నారుల చేతుల్లో కదిలిన ‘జనగణమన’.. భారత మాతపై ప్రేమకు శబ్దం అవసరం లేదని ప్రపంచానికి చాటి చెప్పింది.