సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు
- కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్నారంటూ సరిగమ సంస్థ పిటిషన్
- ఇళయరాజాపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని అభ్యర్థన
- ఆయన ఆస్తులను జప్తు చేసి తమకు ఇవ్వాలని పిటిషన్లో వినతి
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు గురువారం నోటీసులు జారీ చేసింది. న్యాయస్థానం గతంలో జారీ చేసిన ఉత్తర్వులను ఆయన ఉల్లంఘిస్తున్నారంటూ ప్రముఖ మ్యూజిక్ సంస్థ 'సరిగమ' దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్పై వివరణ ఇవ్వాలని ధర్మాసనం ఈ సందర్భంగా ఆదేశించింది.
సరిగమ సంస్థ తాజాగా దాఖలు చేసిన ఈ పిటిషన్లో ఇళయరాజాపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. తాము కాపీరైట్లు హక్కులు కలిగి ఉన్న పాటలను ఆయన వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారని, తద్వారా గతంలో కోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా అతిక్రమిస్తున్నారని పేర్కొంది. ఈ మేరకు ఇళయరాజాపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలని విన్నవించింది. అంతేకాకుండా, ఆయన ఆస్తులను జప్తు చేసి, వాటి విక్రయం ద్వారా వచ్చిన సొమ్మును తమకు చెల్లించాలని కూడా పిటిషన్లో కోరింది.
గతంలో ఇళయరాజా స్వరపరిచిన పలు చిత్రాల పాటలకు సంబంధించిన కాపీరైటు హక్కులు తమకే దక్కుతాయని, అయినప్పటికీ ఆయన ఆ హక్కులను క్లెయిమ్ చేస్తూ వాణిజ్యపరంగా వాడుకుంటున్నారని సరిగమ సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అప్పట్లో ఈ పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం, ఈ వ్యవహారంపై స్టే విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
అయితే, ఆ స్టే ఉత్తర్వులను ఇళయరాజా బేఖాతరు చేస్తున్నారని సరిగమ తాజాగా ఆరోపించింది. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు, ఈ ఫిర్యాదుపై స్పందించాలని ఆదేశిస్తూ ఇళయరాజాకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.
సరిగమ సంస్థ తాజాగా దాఖలు చేసిన ఈ పిటిషన్లో ఇళయరాజాపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. తాము కాపీరైట్లు హక్కులు కలిగి ఉన్న పాటలను ఆయన వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారని, తద్వారా గతంలో కోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా అతిక్రమిస్తున్నారని పేర్కొంది. ఈ మేరకు ఇళయరాజాపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలని విన్నవించింది. అంతేకాకుండా, ఆయన ఆస్తులను జప్తు చేసి, వాటి విక్రయం ద్వారా వచ్చిన సొమ్మును తమకు చెల్లించాలని కూడా పిటిషన్లో కోరింది.
గతంలో ఇళయరాజా స్వరపరిచిన పలు చిత్రాల పాటలకు సంబంధించిన కాపీరైటు హక్కులు తమకే దక్కుతాయని, అయినప్పటికీ ఆయన ఆ హక్కులను క్లెయిమ్ చేస్తూ వాణిజ్యపరంగా వాడుకుంటున్నారని సరిగమ సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అప్పట్లో ఈ పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం, ఈ వ్యవహారంపై స్టే విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
అయితే, ఆ స్టే ఉత్తర్వులను ఇళయరాజా బేఖాతరు చేస్తున్నారని సరిగమ తాజాగా ఆరోపించింది. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు, ఈ ఫిర్యాదుపై స్పందించాలని ఆదేశిస్తూ ఇళయరాజాకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.