తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం.. కలిసిపోయిన ఈటల, బండి
- బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య సయోధ్య
- కలిసి పనిచేయాలని ఇరు నేతల నిర్ణయం
- అధిష్టానం ఆదేశాలతో రంగంలోకి దిగిన అభయ్ పాటిల్
- వ్యక్తిగత విభేదాలు లేవని స్పష్టం చేసిన నేతలు
- రానున్న ఎన్నికలే లక్ష్యంగా ఐక్యంగా ముందుకెళ్లాలని తీర్మానం
తెలంగాణ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న విభేదాలకు తెరపడింది. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా ఇరువురు నేతలు కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయించుకున్నారు. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ నివాసంలో శనివారం జరిగిన ఈ సయోధ్య భేటీకి రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ మధ్యవర్తిత్వం వహించారు.
పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఐక్యంగా కృషి చేయాలని అధిష్టానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని అభయ్ పాటిల్ ఇరువురు నేతలకు వివరించినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా చిన్న చిన్న భేదాభిప్రాయాలను పక్కనపెట్టడానికి తాను సిద్ధంగా ఉన్నానని, తనకు ఎవరిపైనా వ్యక్తిగత ద్వేషం లేదని స్పష్టం చేశారు. బండి సంజయ్ కూడా అదే రీతిలో స్పందిస్తూ.. తనకు ఎవరిపైనా కోపం లేదని, పార్టీ క్రమశిక్షణకు తాను పూర్తిగా కట్టుబడి ఉంటానని తెలిపారు. తన వైపు నుంచి ఏవైనా పొరపాట్లు ఉంటే సరిదిద్దుకుంటానని ఆయన హామీ ఇచ్చారు.
సమావేశం అనంతరం ఇరువురు నేతలు ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని ఫొటోలకు పోజులిచ్చారు. దీంతో వారి మధ్య సయోధ్య కుదిరినట్లు స్పష్టమైంది. గత కొంతకాలంగా వేర్వేరు బీసీ సామాజిక వర్గాలకు చెందిన ఈ ఇద్దరు అగ్ర నేతల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు పార్టీపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని ప్రచారం జరిగింది. తాజా పరిణామంతో ఆ వార్తలకు తెరపడినట్లయింది. అయితే, వారి మధ్య ఎటువంటి విభేదాలు లేవని, జమిలి ఎన్నికలు, మహిళా రిజర్వేషన్లు వంటి కీలక అంశాలపై మాత్రమే చర్చించామని ఈ సందర్భంగా ఎంపీ లక్ష్మణ్ వివరించారు.
పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఐక్యంగా కృషి చేయాలని అధిష్టానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని అభయ్ పాటిల్ ఇరువురు నేతలకు వివరించినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా చిన్న చిన్న భేదాభిప్రాయాలను పక్కనపెట్టడానికి తాను సిద్ధంగా ఉన్నానని, తనకు ఎవరిపైనా వ్యక్తిగత ద్వేషం లేదని స్పష్టం చేశారు. బండి సంజయ్ కూడా అదే రీతిలో స్పందిస్తూ.. తనకు ఎవరిపైనా కోపం లేదని, పార్టీ క్రమశిక్షణకు తాను పూర్తిగా కట్టుబడి ఉంటానని తెలిపారు. తన వైపు నుంచి ఏవైనా పొరపాట్లు ఉంటే సరిదిద్దుకుంటానని ఆయన హామీ ఇచ్చారు.
సమావేశం అనంతరం ఇరువురు నేతలు ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని ఫొటోలకు పోజులిచ్చారు. దీంతో వారి మధ్య సయోధ్య కుదిరినట్లు స్పష్టమైంది. గత కొంతకాలంగా వేర్వేరు బీసీ సామాజిక వర్గాలకు చెందిన ఈ ఇద్దరు అగ్ర నేతల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు పార్టీపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని ప్రచారం జరిగింది. తాజా పరిణామంతో ఆ వార్తలకు తెరపడినట్లయింది. అయితే, వారి మధ్య ఎటువంటి విభేదాలు లేవని, జమిలి ఎన్నికలు, మహిళా రిజర్వేషన్లు వంటి కీలక అంశాలపై మాత్రమే చర్చించామని ఈ సందర్భంగా ఎంపీ లక్ష్మణ్ వివరించారు.