వచ్చే 6 నెలల్లో అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం.. డబ్బుల చెల్లింపునకు ఏపీ ప్రభుత్వం రోడ్మ్యాప్!
- హోంమంత్రి అనిత నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం తొలి భేటీ
- 6 నెలల్లో ఆస్తుల వేలం ద్వారా బాధితులకు డబ్బుల చెల్లింపు
- కేసుల వేగవంతమైన పరిష్కారానికి 'ప్రత్యేక కోర్టు' ఏర్పాటు
- ఏపీలో 11.57 లక్షల మంది బాధితులకు రూ.3,944 కోట్ల చెల్లింపుల లక్ష్యం
- 8 రాష్ట్రాల్లోని 23,599 ఎకరాల భూములకు జియో ట్యాగింగ్
దాదాపు పదేళ్లుగా న్యాయం కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్న అగ్రిగోల్డ్ బాధితులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అగ్రిగోల్డ్ వ్యవహారంలో ఉన్న అన్ని రకాల న్యాయపరమైన చిక్కులను వేగంగా పరిష్కరించి, వచ్చే ఆరు నెలల వ్యవధిలోనే ఆస్తుల వేలం ద్వారా బాధితులకు డబ్బులు చెల్లించేలా ఒక స్పష్టమైన కార్యాచరణను చేపడుతున్నట్లు మంత్రివర్గ ఉపసంఘం అధికారికంగా ప్రకటించింది. ఈ సమస్య పరిష్కారానికి ప్రత్యేక కోర్టు ఏర్పాటు దిశగా అడుగులు వేయడంతో పాటు, ప్రతి 15 రోజులకోసారి మంత్రుల కమిటీ సమావేశమై పురోగతిని నిరంతరం సమీక్షించాలని నిర్ణయించింది.
సచివాలయంలో హోంమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం తొలి సమావేశం జరిగింది. ఈ భేటీలో ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ నేరుగా పాల్గొనగా, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వర్చువల్గా హాజరయ్యారు. అగ్రిగోల్డ్ కేసుల ప్రస్తుత స్థితిగతులు, ఆస్తుల గుర్తింపు, వేలం ప్రక్రియ, డిపాజిటర్ల క్లెయిమ్లపై అధికారులు పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ప్రతి బాధితుడికి న్యాయం జరిగేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేక చొరవతో 'ప్రత్యేక కోర్టు' ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు.
జియో ట్యాగింగ్తో ఆస్తుల రక్షణ
అగ్రిగోల్డ్కు చెందిన ఆస్తుల పరిరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మొత్తం ఎనిమిది రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 23,599 ఎకరాల భూములను గుర్తించి, వాటిని జియో ట్యాగింగ్ చేయడం ద్వారా రికార్డులను డిజిటల్ రూపంలో భద్రపరచనున్నారు. ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా సుమారు 11.57 లక్షల మంది డిపాజిటర్లు ఉన్నారని, వారికి రూ.3,944 కోట్లు చెల్లించాల్సి ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే, సీఐడీ దర్యాప్తులో సుమారు రూ.2,000 కోట్ల విలువైన బాండ్లు ఏజెంట్ల వద్దనే ఉన్నట్లు గుర్తించామని, వాటిని 30 రోజుల్లోగా స్వాధీనం చేసుకునే చర్యలు ప్రారంభిస్తామన్నారు.
గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అగ్రిగోల్డ్ ఆస్తుల రికార్డులను, సర్వే నంబర్లను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, సీఐడీ వద్ద ఉన్న కొన్ని కీలకమైన హార్డ్డిస్కులు కూడా కనిపించకుండా పోయాయని ఆరోపించారు. వారి నిర్లక్ష్యం వల్లే సమస్య మరింత జటిలమైందని విమర్శించారు.
సచివాలయంలో హోంమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం తొలి సమావేశం జరిగింది. ఈ భేటీలో ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ నేరుగా పాల్గొనగా, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వర్చువల్గా హాజరయ్యారు. అగ్రిగోల్డ్ కేసుల ప్రస్తుత స్థితిగతులు, ఆస్తుల గుర్తింపు, వేలం ప్రక్రియ, డిపాజిటర్ల క్లెయిమ్లపై అధికారులు పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ప్రతి బాధితుడికి న్యాయం జరిగేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేక చొరవతో 'ప్రత్యేక కోర్టు' ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు.
జియో ట్యాగింగ్తో ఆస్తుల రక్షణ
అగ్రిగోల్డ్కు చెందిన ఆస్తుల పరిరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మొత్తం ఎనిమిది రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 23,599 ఎకరాల భూములను గుర్తించి, వాటిని జియో ట్యాగింగ్ చేయడం ద్వారా రికార్డులను డిజిటల్ రూపంలో భద్రపరచనున్నారు. ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా సుమారు 11.57 లక్షల మంది డిపాజిటర్లు ఉన్నారని, వారికి రూ.3,944 కోట్లు చెల్లించాల్సి ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే, సీఐడీ దర్యాప్తులో సుమారు రూ.2,000 కోట్ల విలువైన బాండ్లు ఏజెంట్ల వద్దనే ఉన్నట్లు గుర్తించామని, వాటిని 30 రోజుల్లోగా స్వాధీనం చేసుకునే చర్యలు ప్రారంభిస్తామన్నారు.
గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అగ్రిగోల్డ్ ఆస్తుల రికార్డులను, సర్వే నంబర్లను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, సీఐడీ వద్ద ఉన్న కొన్ని కీలకమైన హార్డ్డిస్కులు కూడా కనిపించకుండా పోయాయని ఆరోపించారు. వారి నిర్లక్ష్యం వల్లే సమస్య మరింత జటిలమైందని విమర్శించారు.