భారత వాలీబాల్ జట్టు చారిత్రక విజయంపై స్పందించిన విజయ్ దేవరకొండ
- దేశంలో క్రీడలను మరింత ప్రోత్సహించాలన్న విజయ్ దేవరకొండ
- ఏవీసీ మెన్స్ కప్లో భారత వాలీబాల్ జట్టుకు కాంస్యం
- ఆటగాళ్లకు గుర్తింపు, ఆర్థిక భద్రత కల్పించాలని సూచన
- ప్రైమ్ వాలీబాల్ లీగ్లో హైదరాబాద్ బ్లాక్ హాక్స్కు సహ యజమాని
ప్రైమ్ వాలీబాల్ లీగ్లో హైదరాబాద్ బ్లాక్ హాక్స్ జట్టు సహ యజమానిగా ఉన్న విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, "వాలీబాల్ క్రీడల్లో నేను భాగస్వామిని కావడానికి ఇదే ప్రధాన కారణం. దేశంలోని యువతను క్రీడల వైపు మళ్లించడం, క్రీడాకారులకు తగిన గుర్తింపునిస్తూ వారి భవిష్యత్తుకు భరోసా కల్పించడం మనందరి బాధ్యత. మన దగ్గర అపారమైన ప్రతిభ ఉంది" అని పేర్కొన్నారు.
అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఏవీసీ కప్లో కాంస్య పతకం కోసం జరిగిన పోరులో భారత జట్టు 3-1 తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ బహ్రెయిన్పై ఘన విజయం సాధించింది. ఈ టోర్నమెంట్లో భారత్కు ఇదే తొలి పతకం కావడం విశేషం. ఈ విజయం దేశంలో వాలీబాల్ క్రీడకు పెరుగుతున్న ఆదరణకు నిదర్శనంగా నిలిచింది.
విజయ్ దేవరకొండ కేవలం జట్టు యజమానిగానే పరిమితం కాకుండా, టీజీ20 లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తూ యువ క్రికెటర్లను కూడా ప్రోత్సహిస్తున్నారు. ప్రైమ్ వాలీబాల్ లీగ్ వంటి ప్రొఫెషనల్ లీగ్లు క్రికెటేతర క్రీడల్లోని ప్రతిభను వెలికితీయడానికి, క్రీడాకారులకు స్థిరమైన కెరీర్ను అందించడానికి ఎంతో దోహదపడతాయని నిపుణులు భావిస్తున్నారు.