ప్రైవేట్ ఆసుపత్రుల బకాయిల కోసం రూ. 919 కోట్లు విడుదల చేశాం: సత్యకుమార్

  • నిధులను నేరుగా ఆసుపత్రుల ఖాతాల్లోకి జమ చేశామన్న సత్యకుమార్
  • 785 ప్రైవేట్ ఆసుపత్రులకు నిధులు అందాయని విడుదల
  • ఇప్పటి వరకు మొత్తం రూ. 5,556 కోట్లు విడుదల చేశామని వెల్లడి
ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య సేవల బలోపేతం దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు అనుబంధ ప్రైవేట్ ఆసుపత్రుల బకాయిల కోసం ప్రభుత్వం రూ. 919.13 కోట్లను విడుదల చేసినట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో వెల్లడించారు. 

ట్రై-పార్టీ బిల్ డిస్కౌంటింగ్ విధానంలో భాగంగా ఈ నిధులను నేరుగా ఆసుపత్రుల ఖాతాల్లోకి జమ చేసినట్లు ఆయన వివరించారు. ఏపీ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ సిస్టమ్స్ వెబ్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకున్న 785 ప్రైవేట్ ఆసుపత్రులకు ఈ నిధులు అందాయని తెలిపారు. 

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రైవేట్ ఆసుపత్రులకు మొత్తం రూ. 5,556 కోట్లను చెల్లించామని, బకాయిల చెల్లింపుల హామీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సత్యకుమార్ యాదవ్ పునరుద్ఘాటించారు. దీనికి సంబంధించిన నివేదికను ట్రస్టు సీఈఓ చక్రధరబాబు మంత్రికి అందజేశారు.

Satya Kumar Yadav
Andhra Pradesh
AP Health Services
NTR Vaidya Seva Trust
Private Hospitals
APCFSS
Healthcare Funds
Chakradhar Babu
AP Government

More Telugu News