నా వ్యాఖ్యలను తప్పుగా ప్రచారం చేశారు: ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల
- ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తున్నారన్న వార్తలను ఖండించిన ఛైర్మన్ కొనకళ్ల
- తన మాటలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని ఆరోపణ
- విద్యుత్తు బస్సుల ప్రైవేటీకరణ కేంద్ర ప్రభుత్వ విధానమని వెల్లడి
- ప్రైవేటు సంస్థలు బస్సులు, డ్రైవర్లను సమకూరిస్తే ఆర్టీసీ కండక్టర్లను ఇస్తుందని వివరణ
ఏపీఎస్ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని, వాటిని నమ్మవద్దని సంస్థ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు స్పష్టం చేశారు. ఈ ప్రచారంపై ఆయన శనివారం మచిలీపట్నంలో వివరణ ఇచ్చారు. తన మాటలను పూర్తిగా వినకుండా కొందరు వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కొనకళ్ల మాట్లాడుతూ.. "దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విద్యుత్తు బస్సుల ప్రైవేటీకరణ జరిగింది. నిర్వహణ కోసం ప్రైవేటు సంస్థలకు టెండర్లు పిలిచారు. ఆ సంస్థలే పెట్టుబడి, నిర్వహణ, డ్రైవర్లను చూసుకుంటాయి. ఆర్టీసీ కేవలం కండక్టర్లను మాత్రమే ఇస్తుంది. బస్సులకు అవసరమైన ఛార్జింగ్ స్టేషన్లు, సబ్ స్టేషన్ల నిర్మాణానికి కేంద్రమే నిధులు కేటాయిస్తోంది" అని వివరించారు.
మచిలీపట్నం బస్టాండులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రయాణికులతో మాట్లాడానని కొనకళ్ల తెలిపారు. ఆ సమయంలో, విద్యుత్తు బస్సులను పూర్తిగా ఆర్టీసీనే నిర్వహించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారని విలేకరులు ప్రస్తావించగా, దానికి తాను ఇచ్చిన సమాధానాన్ని వక్రీకరించారని అన్నారు. కేవలం విద్యుత్తు బస్సుల నిర్వహణ గురించి తాను మాట్లాడితే, మొత్తం ఆర్టీసీనే ప్రైవేటీకరణ చేస్తున్నట్లు చిత్రీకరించడం సరికాదని ఆయన హితవు పలికారు.
ఈ సందర్భంగా కొనకళ్ల మాట్లాడుతూ.. "దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విద్యుత్తు బస్సుల ప్రైవేటీకరణ జరిగింది. నిర్వహణ కోసం ప్రైవేటు సంస్థలకు టెండర్లు పిలిచారు. ఆ సంస్థలే పెట్టుబడి, నిర్వహణ, డ్రైవర్లను చూసుకుంటాయి. ఆర్టీసీ కేవలం కండక్టర్లను మాత్రమే ఇస్తుంది. బస్సులకు అవసరమైన ఛార్జింగ్ స్టేషన్లు, సబ్ స్టేషన్ల నిర్మాణానికి కేంద్రమే నిధులు కేటాయిస్తోంది" అని వివరించారు.
మచిలీపట్నం బస్టాండులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రయాణికులతో మాట్లాడానని కొనకళ్ల తెలిపారు. ఆ సమయంలో, విద్యుత్తు బస్సులను పూర్తిగా ఆర్టీసీనే నిర్వహించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారని విలేకరులు ప్రస్తావించగా, దానికి తాను ఇచ్చిన సమాధానాన్ని వక్రీకరించారని అన్నారు. కేవలం విద్యుత్తు బస్సుల నిర్వహణ గురించి తాను మాట్లాడితే, మొత్తం ఆర్టీసీనే ప్రైవేటీకరణ చేస్తున్నట్లు చిత్రీకరించడం సరికాదని ఆయన హితవు పలికారు.