ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసు రసవత్తరం.. 11 మ్యాచ్లు మిగిలుండగా 8 జట్ల మధ్య హోరాహోరీ!
- ముగింపునకు లీగ్ దశ
- ఇంకా తేలని ప్లేఆఫ్స్ రేసు
- ఇంకా 4 బెర్తుల కోసం 8 జట్లు పోటీ
- గుజరాత్, బెంగళూరు టాప్-2 రేసులో
ఐపీఎల్ 2026 సీజన్ లీగ్ దశ ముగింపునకు వచ్చింది. ప్లేఆఫ్స్ రేసు అత్యంత ఉత్కంఠభరితంగా మారింది. టోర్నమెంట్లో ఇంకా 11 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. నాలుగు ప్లేఆఫ్స్ స్థానాల కోసం ఏకంగా ఎనిమిది జట్లు రేసులో నిలిచాయి. లక్నో చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోవడం ఆ జట్టు అవకాశాలను కాస్త దెబ్బతీసింది. ఈ నేపథ్యంలో వివిధ టీమ్ల ప్లేఆఫ్ అవకాశాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
గుజరాత్ టైటాన్స్: వరుసగా ఐదు మ్యాచ్లు గెలిచి మంచి ఫామ్లో ఉన్న ఈ జట్టు ప్లేఆఫ్స్ చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్ల్లో ఒక్క విజయం సాధిస్తే సరిపోతుంది. ఒకవేళ రెండింటిలోనూ గెలిస్తే తొలి రెండు స్థానాల్లో నిలిచే అవకాశం ఉంటుంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఈ జట్టు ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకోవడానికి మిగిలిన రెండు మ్యాచ్ల్లో ఒకటి గెలిస్తే సరిపోతుంది. రెండింట్లోనూ విజయం సాధిస్తే టాప్-2లో నిలుస్తుంది. అయితే, రెండు మ్యాచ్లు హోమ్ గ్రౌండ్ వెలుపల జరగనుండడం గమనార్హం.
సన్రైజర్స్ హైదరాబాద్: ప్రస్తుతం ఈ జట్టు 14 పాయింట్లతో ఉంది. ఎలాంటి నెట్రన్రేట్ సమీకరణాలతో పని లేకుండా నేరుగా క్వాలిఫై కావాలంటే చివరి రెండు మ్యాచ్ల్లో కచ్చితంగా గెలవాలి. ఒకవేళ పంజాబ్, రాజస్థాన్ జట్లు తమ మిగిలిన మ్యాచ్లన్నీ ఓడిపోతే హైదరాబాద్ 14 పాయింట్లతోనే ప్లేఆఫ్స్కు చేరుతుంది.
చెన్నై సూపర్ కింగ్స్: లక్నో చేతిలో ఓడిపోవడం వల్ల ఈ జట్టు అవకాశాలు దెబ్బతిన్నాయి. అయినా చివరి రెండు మ్యాచ్ల్లో గెలిస్తే 16 పాయింట్లతో రేసులో నిలుస్తుంది. ఇతర జట్ల సమీకరణాలు అనుకూలిస్తే 14 పాయింట్లు, మెరుగైన నెట్రన్రేట్ ఆధారంగానూ క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది.
పంజాబ్ కింగ్స్: వరుసగా ఐదు మ్యాచ్ల్లో ఓడిపోయిన ఈ జట్టు మిగిలిన రెండు మ్యాచ్ల్లో గెలిచి 17 పాయింట్లతో ప్లేఆఫ్స్ చేరే అవకాశం సొంతంగానే ఉంది. ఒకవేళ ఒకే మ్యాచ్ గెలిచి 15 పాయింట్ల వద్ద నిలిస్తే మాత్రం ఈ జట్టు ఇతర జట్ల మ్యాచ్ల ఫలితాలపై పూర్తిగా ఆధారపడాల్సి వస్తుంది.
రాజస్థాన్ రాయల్స్: గత ఏడు మ్యాచ్ల్లో ఐదు ఓటములతో ఐదో స్థానానికి పడిపోయిన ఈ జట్టు మిగిలిన మూడు మ్యాచ్ల్లోనూ గెలిస్తే నేరుగా ప్లేఆఫ్స్ చేరుకుంటుంది. చివరి మ్యాచ్ల్లో ఎదుర్కొనే జట్లు ఇప్పటికే టోర్నమెంట్ నుంచి తప్పుకొన్నవే అయినా వారు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.
కోల్కతా నైట్రైడర్స్: గత మ్యాచ్లో బెంగళూరు చేతిలో ఓడిపోవడం వల్ల ఈ జట్టు గరిష్ఠంగా 15 పాయింట్లకు మాత్రమే చేరుకునే అవకాశం మిగిలి ఉంది. మిగిలిన మూడు మ్యాచ్లు హోమ్ గ్రౌండ్లోనే జరగనుండడం వీరికి కలిసొచ్చే అంశమే. అయినప్పటికీ ప్లేఆఫ్స్ కోసం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాలి.
ఢిల్లీ క్యాపిటల్స్: పంజాబ్పై గెలిచి రేసులో నిలిచిన ఈ జట్టు సమీకరణం చాలా సులభంగా ఉంది. మిగిలిన రెండు మ్యాచ్లను భారీ రన్రేట్ తేడాతో గెలిచి 14 పాయింట్లతో నిలవడంతో పాటు ఇతర జట్ల ఓటములపై ఆధారపడాల్సి ఉంటుంది.
గుజరాత్ టైటాన్స్: వరుసగా ఐదు మ్యాచ్లు గెలిచి మంచి ఫామ్లో ఉన్న ఈ జట్టు ప్లేఆఫ్స్ చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్ల్లో ఒక్క విజయం సాధిస్తే సరిపోతుంది. ఒకవేళ రెండింటిలోనూ గెలిస్తే తొలి రెండు స్థానాల్లో నిలిచే అవకాశం ఉంటుంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఈ జట్టు ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకోవడానికి మిగిలిన రెండు మ్యాచ్ల్లో ఒకటి గెలిస్తే సరిపోతుంది. రెండింట్లోనూ విజయం సాధిస్తే టాప్-2లో నిలుస్తుంది. అయితే, రెండు మ్యాచ్లు హోమ్ గ్రౌండ్ వెలుపల జరగనుండడం గమనార్హం.
సన్రైజర్స్ హైదరాబాద్: ప్రస్తుతం ఈ జట్టు 14 పాయింట్లతో ఉంది. ఎలాంటి నెట్రన్రేట్ సమీకరణాలతో పని లేకుండా నేరుగా క్వాలిఫై కావాలంటే చివరి రెండు మ్యాచ్ల్లో కచ్చితంగా గెలవాలి. ఒకవేళ పంజాబ్, రాజస్థాన్ జట్లు తమ మిగిలిన మ్యాచ్లన్నీ ఓడిపోతే హైదరాబాద్ 14 పాయింట్లతోనే ప్లేఆఫ్స్కు చేరుతుంది.
చెన్నై సూపర్ కింగ్స్: లక్నో చేతిలో ఓడిపోవడం వల్ల ఈ జట్టు అవకాశాలు దెబ్బతిన్నాయి. అయినా చివరి రెండు మ్యాచ్ల్లో గెలిస్తే 16 పాయింట్లతో రేసులో నిలుస్తుంది. ఇతర జట్ల సమీకరణాలు అనుకూలిస్తే 14 పాయింట్లు, మెరుగైన నెట్రన్రేట్ ఆధారంగానూ క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది.
పంజాబ్ కింగ్స్: వరుసగా ఐదు మ్యాచ్ల్లో ఓడిపోయిన ఈ జట్టు మిగిలిన రెండు మ్యాచ్ల్లో గెలిచి 17 పాయింట్లతో ప్లేఆఫ్స్ చేరే అవకాశం సొంతంగానే ఉంది. ఒకవేళ ఒకే మ్యాచ్ గెలిచి 15 పాయింట్ల వద్ద నిలిస్తే మాత్రం ఈ జట్టు ఇతర జట్ల మ్యాచ్ల ఫలితాలపై పూర్తిగా ఆధారపడాల్సి వస్తుంది.
రాజస్థాన్ రాయల్స్: గత ఏడు మ్యాచ్ల్లో ఐదు ఓటములతో ఐదో స్థానానికి పడిపోయిన ఈ జట్టు మిగిలిన మూడు మ్యాచ్ల్లోనూ గెలిస్తే నేరుగా ప్లేఆఫ్స్ చేరుకుంటుంది. చివరి మ్యాచ్ల్లో ఎదుర్కొనే జట్లు ఇప్పటికే టోర్నమెంట్ నుంచి తప్పుకొన్నవే అయినా వారు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.
కోల్కతా నైట్రైడర్స్: గత మ్యాచ్లో బెంగళూరు చేతిలో ఓడిపోవడం వల్ల ఈ జట్టు గరిష్ఠంగా 15 పాయింట్లకు మాత్రమే చేరుకునే అవకాశం మిగిలి ఉంది. మిగిలిన మూడు మ్యాచ్లు హోమ్ గ్రౌండ్లోనే జరగనుండడం వీరికి కలిసొచ్చే అంశమే. అయినప్పటికీ ప్లేఆఫ్స్ కోసం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాలి.
ఢిల్లీ క్యాపిటల్స్: పంజాబ్పై గెలిచి రేసులో నిలిచిన ఈ జట్టు సమీకరణం చాలా సులభంగా ఉంది. మిగిలిన రెండు మ్యాచ్లను భారీ రన్రేట్ తేడాతో గెలిచి 14 పాయింట్లతో నిలవడంతో పాటు ఇతర జట్ల ఓటములపై ఆధారపడాల్సి ఉంటుంది.