పిన్నీసు నుంచి ఫోన్ దాకా.. అన్నింటి ధరలూ పైపైకే!

War Affect Rates increased in all categories
  • నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్స్ సహా అన్ని వస్తువుల ధరలకు రెక్కలు
  • ఫోన్లు, ఏసీలు, టీవీల ధరల్లో 15 శాతం నుంచి 20 శాతం వరకు పెరుగుదల
  • పారాసిటమాల్ సహా 760 రకాల మందుల ధరలు అమాంతం పెంపు
  • గ్యాస్ కొరతతో హోటళ్లలో ఇడ్లీ, దోశ వంటి టిఫిన్ల ధరలు ప్రియం
సామాన్య, మధ్యతరగతి ప్రజలపై ధరల భారం నలువైపుల నుంచి విరుచుకుపడుతోంది. ఉదయం తినే టిఫిన్ నుంచి నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, మందుల వరకు అన్నింటి ధరలూ అమాంతం పెరిగిపోయాయి. గత నెల రోజులుగా మార్కెట్లో చోటుచేసుకున్న ఈ మార్పులతో జీవన వ్యయం పెరిగి ప్రజలు విలవిల్లాడుతున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, హర్మూజ్‌ జలసంధి మూతపడటంతో సరఫరా వ్యవస్థలకు ఆటంకాలు ఏర్పడటమే ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

ఎలక్ట్రానిక్, గృహోపకరణాల ధరలు భారీగా పెరిగాయి. రాగి, అల్యూమినియం వంటి ముడిసరుకుల ధరలు పెరగడం, సెమీకండక్టర్ చిప్‌ల కొరతతో ఫోన్ల ధరలు 10-20 శాతం వరకు పెరిగాయి. గతంలో రూ.15 వేలకు దొరికిన ఫోన్‌ ఇప్పుడు రూ.18 వేలు దాటింది. ఏసీల ధరలు 15 శాతం, టీవీల ధరలు 10 శాతం, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్ల ధరలు 8-15 శాతం వరకు భారంగా మారాయి. టెలికం సంస్థలు కూడా టారిఫ్‌లను 20 శాతం వరకు పెంచాయి.

మరోవైపు, అత్యవసర మందుల ధరలు సైతం చుక్కలనంటాయి. ఏప్రిల్ 1 నుంచి జ్వరం, మధుమేహం, బీపీకి వాడే 760 రకాల మందుల ధరలు పెరిగాయి. పారాసిటమాల్‌పై ఏకంగా 92 శాతం ధర పెరగడం ఆందోళన కలిగిస్తోంది. నిర్మాణ రంగంలోనూ ఉక్కు ధర 35 శాతం, సిమెంట్ ధర 10 శాతం పెరగడంతో సొంతింటి కల మరింత ప్రియంగా మారింది.

వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత, బ్లాక్ మార్కెట్ కారణంగా హోటళ్లలో ఆహార పదార్థాల ధరలు పెరిగాయి. ఇడ్లీ, దోశ వంటి టిఫిన్ల ధరలు ప్లేటుకు రూ.10 నుంచి రూ.15 వరకు పెంచేశారు. ఆన్‌లైన్ ఫుడ్, గ్రాసరీ యాప్‌లలోనూ ధరలు 6 నుంచి 9 శాతం వరకు పెరగడంతో వినియోగదారులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఒకదాని ధర పెరగడం గొలుసుకట్టుగా మరోదానిపై ప్రభావం చూపుతూ అన్ని రంగాల్లోనూ ధరల మంట కొనసాగుతోంది.
Go Back to Shorts
War
Iran
Israel
USA
Rates
Increased
Electronics
TVs
Mobile Phones
Smart Phones
Idly
Dosa
Tiffins

More Telugu News