చైనాలో డబ్బుల వర్షం.. అపార్ట్మెంట్ నుంచి కోట్లు విసిరేసిన మహిళ.. వీడియో ఇదిగో!
- తీవ్ర మానసిక వేదనతో ఈ చర్యకు పాల్పడినట్లు అనుమానం
- సుమారు 2 మిలియన్ల హాంకాంగ్ డాలర్ల విలువైన నగదు
- డబ్బు ఏరుకునేందుకు పోటీ పడిన స్థానికులు, నెలకొన్న గందరగోళం
- ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు, డబ్బు తిరిగివ్వాలని విజ్ఞప్తి
చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లో ఒక వింత ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన అపార్ట్మెంట్ బాల్కనీ నుంచి పెద్ద మొత్తంలో నగదును కిందకు విసిరేయడం సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. శాంతూ నగరంలోని ‘స్టార్ లేక్ సిటీ’ నివాస సముదాయంలో ఏప్రిల్ 14న ఉదయం ఈ సంఘటన జరిగింది. ఓ మహిళ తన అపార్ట్మెంట్ నుంచి హాంకాంగ్ కరెన్సీకి చెందిన 1,000 డాలర్ల నోట్ల కట్టలను గాలిలోకి విసిరేసింది. గాలిలో తేలుతూ వస్తున్న నోట్లను చూసిన స్థానికులు, బాటసారులు వాటిని ఏరుకోవడానికి పోటీ పడటంతో ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం నెలకొంది.
విసిరేసిన నగదు విలువ సుమారు 1 మిలియన్ నుంచి 2 మిలియన్ల హాంకాంగ్ డాలర్ల (భారత కరెన్సీలో కోట్లల్లోనే) వరకు ఉండొచ్చని ప్రత్యక్ష సాక్షులు అంచనా వేస్తున్నారు. కుటుంబ సభ్యుల అనారోగ్యం కారణంగా సదరు మహిళ తీవ్ర మానసిక వేదనకు గురైనట్లు ప్రాథమిక సమాచారం. భార్యాభర్తల మధ్య గొడవ కూడా ఈ ఘటనకు కారణమై ఉండవచ్చని కొన్ని కథనాలు చెబుతున్నాయి.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఏరుకున్న డబ్బును తిరిగి ఇచ్చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చాలామంది నిజాయతీగా నగదును తిరిగి అప్పగించారు. ప్రస్తుతం ఆ మహిళ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
విసిరేసిన నగదు విలువ సుమారు 1 మిలియన్ నుంచి 2 మిలియన్ల హాంకాంగ్ డాలర్ల (భారత కరెన్సీలో కోట్లల్లోనే) వరకు ఉండొచ్చని ప్రత్యక్ష సాక్షులు అంచనా వేస్తున్నారు. కుటుంబ సభ్యుల అనారోగ్యం కారణంగా సదరు మహిళ తీవ్ర మానసిక వేదనకు గురైనట్లు ప్రాథమిక సమాచారం. భార్యాభర్తల మధ్య గొడవ కూడా ఈ ఘటనకు కారణమై ఉండవచ్చని కొన్ని కథనాలు చెబుతున్నాయి.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఏరుకున్న డబ్బును తిరిగి ఇచ్చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చాలామంది నిజాయతీగా నగదును తిరిగి అప్పగించారు. ప్రస్తుతం ఆ మహిళ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.