భారత ఏజెన్సీల భారీ విజయం.. దేశానికి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సాహిల్
భారత భద్రతా ఏజెన్సీలకు భారీ విజయం లభించింది. మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్గా పేరొందిన సాహిల్ చౌహాన్ థాయ్లాండ్ నుంచి బహిష్కరణకు గురికావడంతో భారత్కు తీసుకువస్తున్నారు. శనివారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి అతడు చేరుకోగానే, హర్యానా స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) అదుపులోకి తీసుకుంటుందని అధికారులు తెలిపారు.
సంఘటిత నేరాలకు పాల్పడుతున్న సాహిల్ చౌహాన్పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) వద్ద కూడా పలు కేసులు నమోదై ఉన్నాయి. ప్రస్తుతం హర్యానా జైలులో ఉన్న కౌశల్ చౌదరి నేతృత్వంలోని గ్యాంగ్లో ఇతను కీలక సభ్యుడని పోలీసులు భావిస్తున్నారు. విదేశాల్లో ఉంటూనే భారత్లో అనేక కాంట్రాక్ట్ హత్యలకు సాహిల్ పథకరచన చేసినట్లు ఆరోపణలున్నాయి. దీంతో ఇతడిని పట్టుకోవడం ఏజెన్సీలకు అత్యంత ప్రాధాన్యంగా మారింది.
కేంద్ర ఏజెన్సీలు, హర్యానా పోలీసుల సమన్వయంతో సాగించిన ఆపరేషన్ ఫలితంగా ఇటీవల విదేశాల్లో సాహిల్ను అదుపులోకి తీసుకున్నారు. అతడి రాక సందర్భంగా ఢిల్లీ విమానాశ్రయంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. కస్టడీలోకి తీసుకున్న తర్వాత సాహిల్ను కోర్టులో హాజరుపరిచి, తదుపరి విచారణ కోసం హర్యానాకు తరలించే అవకాశం ఉంది.
భారత గ్యాంగ్లతో సంబంధం ఉన్న అంతర్జాతీయ నేర నెట్వర్క్లను ఛేదించే ప్రయత్నంలో ఈ బహిష్కరణ ఒక కీలక ముందడుగుగా భావిస్తున్నారు. పరారీలో ఉన్న నేరస్థులను న్యాయస్థానం ముందు నిలబెట్టడంలో అంతర్జాతీయ సహకారం పెరగడానికి ఇది నిదర్శనమని అధికారులు పేర్కొన్నారు.
సంఘటిత నేరాలకు పాల్పడుతున్న సాహిల్ చౌహాన్పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) వద్ద కూడా పలు కేసులు నమోదై ఉన్నాయి. ప్రస్తుతం హర్యానా జైలులో ఉన్న కౌశల్ చౌదరి నేతృత్వంలోని గ్యాంగ్లో ఇతను కీలక సభ్యుడని పోలీసులు భావిస్తున్నారు. విదేశాల్లో ఉంటూనే భారత్లో అనేక కాంట్రాక్ట్ హత్యలకు సాహిల్ పథకరచన చేసినట్లు ఆరోపణలున్నాయి. దీంతో ఇతడిని పట్టుకోవడం ఏజెన్సీలకు అత్యంత ప్రాధాన్యంగా మారింది.
కేంద్ర ఏజెన్సీలు, హర్యానా పోలీసుల సమన్వయంతో సాగించిన ఆపరేషన్ ఫలితంగా ఇటీవల విదేశాల్లో సాహిల్ను అదుపులోకి తీసుకున్నారు. అతడి రాక సందర్భంగా ఢిల్లీ విమానాశ్రయంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. కస్టడీలోకి తీసుకున్న తర్వాత సాహిల్ను కోర్టులో హాజరుపరిచి, తదుపరి విచారణ కోసం హర్యానాకు తరలించే అవకాశం ఉంది.
భారత గ్యాంగ్లతో సంబంధం ఉన్న అంతర్జాతీయ నేర నెట్వర్క్లను ఛేదించే ప్రయత్నంలో ఈ బహిష్కరణ ఒక కీలక ముందడుగుగా భావిస్తున్నారు. పరారీలో ఉన్న నేరస్థులను న్యాయస్థానం ముందు నిలబెట్టడంలో అంతర్జాతీయ సహకారం పెరగడానికి ఇది నిదర్శనమని అధికారులు పేర్కొన్నారు.