లెబనాన్ నుంచి దూసుకొచ్చిన రాకెట్లు.. ఇజ్రాయెల్లో సైరన్ల మోత
అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన బలహీనమైన కాల్పుల విరమణ ఒప్పందం ప్రమాదంలో పడింది. లెబనాన్ నుంచి ఇజ్రాయెల్పై రాకెట్ల వర్షం కురవడంతో మధ్యప్రాచ్యంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. శుక్రవారం తెల్లవారుజామున టెల్ అవీవ్, అష్డోద్ సహా పలు ఇజ్రాయెల్ నగరాల్లో హెచ్చరిక సైరన్లు మోగాయి. తామే ఈ దాడులు చేశామని హెజ్బొల్లా ప్రకటించగా, కొన్ని రాకెట్లను అడ్డుకున్నామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.
ఈ దాడులతో శాంతి చర్చలకు విఘాతం కలుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు, ప్రపంచ వాణిజ్యంలో కీలకమైన హర్మూజ్ జలసంధిపై ఇరాన్ పట్టు బిగించింది. కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ, ఈ మార్గంలో నౌకల రాకపోకలు నిలిచిపోయాయి. హర్మూజ్ జలసంధి మూసివేతపై యూఏఈ చమురు సంస్థ అధిపతి ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధ నష్టానికి పరిహారం డిమాండ్ చేస్తామని, హర్మూజ్ జలసంధిపై తమ నియంత్రణను కొత్త దశకు తీసుకెళ్తామని ఇరాన్ నేత మొజ్తబా ఖమేనీ హెచ్చరించారు.
ఈ ఉద్రిక్తతల నడుమ దౌత్యపరమైన ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి. పాకిస్థాన్లోని ఇస్లామాబాద్లో అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు జరగనున్నాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగారు. లెబనాన్పై దాడుల తీవ్రతను తగ్గించాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ట్రంప్ సూచించినట్లు తెలిసింది. మరోవైపు, ఇరాన్, దాని అనుబంధ సంస్థలు తమపై డ్రోన్ దాడులు చేశాయని కువైట్ ఆరోపించగా, తమ ఆయిల్ పైప్లైన్కు నష్టం వాటిల్లిందని సౌదీ అరేబియా తెలిపింది. అయితే ఈ ఆరోపణలను ఇరాన్ ఖండించింది. హర్మూజ్ జలసంధిలో తమ నౌకల భద్రతపై చర్చించేందుకు దక్షిణ కొరియా తమ ప్రత్యేక ప్రతినిధిని ఇరాన్కు పంపనుంది.
ఈ దాడులతో శాంతి చర్చలకు విఘాతం కలుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు, ప్రపంచ వాణిజ్యంలో కీలకమైన హర్మూజ్ జలసంధిపై ఇరాన్ పట్టు బిగించింది. కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ, ఈ మార్గంలో నౌకల రాకపోకలు నిలిచిపోయాయి. హర్మూజ్ జలసంధి మూసివేతపై యూఏఈ చమురు సంస్థ అధిపతి ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధ నష్టానికి పరిహారం డిమాండ్ చేస్తామని, హర్మూజ్ జలసంధిపై తమ నియంత్రణను కొత్త దశకు తీసుకెళ్తామని ఇరాన్ నేత మొజ్తబా ఖమేనీ హెచ్చరించారు.
ఈ ఉద్రిక్తతల నడుమ దౌత్యపరమైన ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి. పాకిస్థాన్లోని ఇస్లామాబాద్లో అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు జరగనున్నాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగారు. లెబనాన్పై దాడుల తీవ్రతను తగ్గించాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ట్రంప్ సూచించినట్లు తెలిసింది. మరోవైపు, ఇరాన్, దాని అనుబంధ సంస్థలు తమపై డ్రోన్ దాడులు చేశాయని కువైట్ ఆరోపించగా, తమ ఆయిల్ పైప్లైన్కు నష్టం వాటిల్లిందని సౌదీ అరేబియా తెలిపింది. అయితే ఈ ఆరోపణలను ఇరాన్ ఖండించింది. హర్మూజ్ జలసంధిలో తమ నౌకల భద్రతపై చర్చించేందుకు దక్షిణ కొరియా తమ ప్రత్యేక ప్రతినిధిని ఇరాన్కు పంపనుంది.