ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్: పైలట్ల పనివేళలపై డీజీసీఏ కీలక నిర్ణయం
ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ విమానాలు సుదీర్ఘమైన మార్గాల్లో ప్రయాణించాల్సి వస్తుండటంతో, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. సుదూర విమానాలకు సంబంధించి పైలట్ల డ్యూటీ సమయ పరిమితుల్లో (FDTL) తాత్కాలికంగా కొన్ని సడలింపులు ఇచ్చినట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది. ఈ విషయాన్ని మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ అసాంగ్బా చుబా ఏవో మీడియాకు వెల్లడించారు.
మధ్యప్రాచ్యంలోని పలు దేశాలు తమ గగనతలాన్ని మూసివేయడంతో, పశ్చిమ దేశాలకు వెళ్లే విమానాలు చుట్టూ తిరిగి ప్రయాణించాల్సి వస్తోంది. దీనివల్ల విమాన ప్రయాణ సమయం పెరిగి, కొత్త డ్యూటీ నిబంధనలను పాటించడం విమానయాన సంస్థలకు కష్టంగా మారింది. ఈ నేపథ్యంలోనే డీజీసీఏ ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో ఏప్రిల్ 30 వరకు ఇలాంటి సడలింపులు ఇచ్చారు.
తాజా సడలింపుల ప్రకారం, ఇద్దరు పైలట్లు నడిపే సుదూర విమానాల్లో 'ఫ్లైట్ టైమ్' (FT)ను 1.30 గంటలు అదనంగా పెంచి, మొత్తం 11.30 గంటలకు పొడిగించారు. అదేవిధంగా 'ఫ్లైట్ డ్యూటీ పీరియడ్' (FDP)ను 1.45 గంటలు పెంచి 11.45 గంటలుగా నిర్ధారించారు. విమానం టేకాఫ్ కోసం కదలడం ప్రారంభించినప్పటి నుంచి, గమ్యస్థానం చేరాక పూర్తిగా ఆగిపోయే వరకు పట్టే సమయాన్ని 'ఫ్లయింగ్ టైమ్'గా పరిగణిస్తారు.
పైలట్ల అలసటను తగ్గించి, విమాన భద్రతను పెంచేందుకు డీజీసీఏ గతేడాది కఠినమైన నిబంధనలను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం పైలట్లకు ఇచ్చే వరుస విశ్రాంతి సమయాన్ని 36 గంటల నుంచి 48 గంటలకు పెంచారు. ఈ సడలింపులు తాత్కాలికమే అయినప్పటికీ, సిబ్బంది లభ్యత, నిబంధనల పాటింపు వంటి అంశాలపై విమానయాన సంస్థలను నిశితంగా పర్యవేక్షిస్తున్నామని డీజీసీఏ అధికారులు తెలిపారు.
మధ్యప్రాచ్యంలోని పలు దేశాలు తమ గగనతలాన్ని మూసివేయడంతో, పశ్చిమ దేశాలకు వెళ్లే విమానాలు చుట్టూ తిరిగి ప్రయాణించాల్సి వస్తోంది. దీనివల్ల విమాన ప్రయాణ సమయం పెరిగి, కొత్త డ్యూటీ నిబంధనలను పాటించడం విమానయాన సంస్థలకు కష్టంగా మారింది. ఈ నేపథ్యంలోనే డీజీసీఏ ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో ఏప్రిల్ 30 వరకు ఇలాంటి సడలింపులు ఇచ్చారు.
తాజా సడలింపుల ప్రకారం, ఇద్దరు పైలట్లు నడిపే సుదూర విమానాల్లో 'ఫ్లైట్ టైమ్' (FT)ను 1.30 గంటలు అదనంగా పెంచి, మొత్తం 11.30 గంటలకు పొడిగించారు. అదేవిధంగా 'ఫ్లైట్ డ్యూటీ పీరియడ్' (FDP)ను 1.45 గంటలు పెంచి 11.45 గంటలుగా నిర్ధారించారు. విమానం టేకాఫ్ కోసం కదలడం ప్రారంభించినప్పటి నుంచి, గమ్యస్థానం చేరాక పూర్తిగా ఆగిపోయే వరకు పట్టే సమయాన్ని 'ఫ్లయింగ్ టైమ్'గా పరిగణిస్తారు.
పైలట్ల అలసటను తగ్గించి, విమాన భద్రతను పెంచేందుకు డీజీసీఏ గతేడాది కఠినమైన నిబంధనలను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం పైలట్లకు ఇచ్చే వరుస విశ్రాంతి సమయాన్ని 36 గంటల నుంచి 48 గంటలకు పెంచారు. ఈ సడలింపులు తాత్కాలికమే అయినప్పటికీ, సిబ్బంది లభ్యత, నిబంధనల పాటింపు వంటి అంశాలపై విమానయాన సంస్థలను నిశితంగా పర్యవేక్షిస్తున్నామని డీజీసీఏ అధికారులు తెలిపారు.