Dhruv Jurel: గెలుపు అంచుల వరకు వచ్చిన గుజరాత్... థ్రిల్లింగ్ పోరులో రాజస్థాన్ విజయం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో మరో హోరాహోరీ మ్యాచ్ అభిమానులను అలరించింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 6 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ చివరి వరకు పోరాడినా, కీలక సమయంలో వికెట్లు కోల్పోయి ఓటమిపాలైంది.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరు చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ (42 బంతుల్లో 75 పరుగులు; 5 ఫోర్లు, 5 సిక్సులు) విధ్వంసకర ఇన్నింగ్స్తో చెలరేగగా, యశస్వి జైస్వాల్ (36 బంతుల్లో 55) హాఫ్ సెంచరీతో రాణించాడు. వీరిద్దరి మెరుపులతో రాజస్థాన్ పటిష్ట స్థితిలో నిలిచింది. గుజరాత్ బౌలర్లలో కగిసో రబాడ రెండు వికెట్లు తీశాడు.
అనంతరం 211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్కు సాయి సుదర్శన్ (44 బంతుల్లో 73 పరుగులు; 9 ఫోర్లు, 3 సిక్సులు) అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. అతను క్రీజులో ఉన్నంతసేపు గుజరాత్ విజయం ఖాయమనిపించింది. అయితే, కీలక సమయంలో రాజస్థాన్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ తన మాయాజాలంతో మ్యాచ్ను మలుపు తిప్పాడు. అతను ఒకే ఓవర్లో కీలక వికెట్లు పడగొట్టడంతో సహా మొత్తం నాలుగు వికెట్లతో గుజరాత్ మిడిలార్డర్ను దెబ్బతీశాడు.
చివర్లో రషీద్ ఖాన్ (24), రబాడ (23 నాటౌట్) పోరాడినా, జట్టును గెలిపించలేకపోయారు. ఆఖరి ఓవర్లో విజయానికి 11 పరుగులు అవసరం కాగా, 4 పరుగులే లభించాయి. చివరికి గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 204 పరుగులకే పరిమితమైంది.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరు చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ (42 బంతుల్లో 75 పరుగులు; 5 ఫోర్లు, 5 సిక్సులు) విధ్వంసకర ఇన్నింగ్స్తో చెలరేగగా, యశస్వి జైస్వాల్ (36 బంతుల్లో 55) హాఫ్ సెంచరీతో రాణించాడు. వీరిద్దరి మెరుపులతో రాజస్థాన్ పటిష్ట స్థితిలో నిలిచింది. గుజరాత్ బౌలర్లలో కగిసో రబాడ రెండు వికెట్లు తీశాడు.
అనంతరం 211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్కు సాయి సుదర్శన్ (44 బంతుల్లో 73 పరుగులు; 9 ఫోర్లు, 3 సిక్సులు) అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. అతను క్రీజులో ఉన్నంతసేపు గుజరాత్ విజయం ఖాయమనిపించింది. అయితే, కీలక సమయంలో రాజస్థాన్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ తన మాయాజాలంతో మ్యాచ్ను మలుపు తిప్పాడు. అతను ఒకే ఓవర్లో కీలక వికెట్లు పడగొట్టడంతో సహా మొత్తం నాలుగు వికెట్లతో గుజరాత్ మిడిలార్డర్ను దెబ్బతీశాడు.
చివర్లో రషీద్ ఖాన్ (24), రబాడ (23 నాటౌట్) పోరాడినా, జట్టును గెలిపించలేకపోయారు. ఆఖరి ఓవర్లో విజయానికి 11 పరుగులు అవసరం కాగా, 4 పరుగులే లభించాయి. చివరికి గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 204 పరుగులకే పరిమితమైంది.