Ashok Sharma: ఎవరీ అశోక్ శర్మ..? ఈ ఐపీఎల్ సీజన్ లోనే ఫాస్టెస్ట్ బాల్ నమోదు!
ఐపీఎల్ 2026 సీజన్లో యువ కెరటం అశోక్ శర్మ సంచలనం సృష్టించాడు. గుజరాత్ టైటాన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న 23 ఏళ్ల పేసర్, ఈ సీజన్లోనే అత్యంత వేగవంతమైన బంతిని విసిరి రికార్డు నెలకొల్పాడు. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 154.2 కిలోమీటర్ల వేగంతో బంతిని సంధించి అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఈ అద్భుతమైన డెలివరీతో, ఈ సీజన్లో ఫాస్టెస్ట్ బాల్ వేసిన ఆన్రిచ్ నోర్కియా రికార్డును అతను బద్దలు కొట్టాడు.
అహ్మదాబాద్ వేదికగా శనివారం జరిగిన ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ మొదట బ్యాటింగ్ చేసింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 210 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (55), వైభవ్ సూర్యవంశి (31), ధ్రువ్ జురెల్ (75) రాణించారు. గుజరాత్ బౌలర్లలో రబాడా రెండు వికెట్లు తీశాడు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ 16వ ఓవర్ వేసిన అశోక్ శర్మ తన వేగంతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. అదే ఓవర్లో ఒక బంతిని 150.7 కి.మీ వేగంతో వేసిన అతను, చివరి బంతిని 154.2 కి.మీ వేగంతో విసిరి చరిత్ర సృష్టించాడు.
రాజస్థాన్కు చెందిన ఈ యువ మీడియం పేసర్, బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగల సామర్థ్యానికి, కచ్చితమైన లైన్ అండ్ లెంత్కు ప్రసిద్ధి. గతంలో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు నెట్ బౌలర్గా సేవలందించాడు. అతని ప్రతిభను గుర్తించిన కోల్కతా నైట్ రైడర్స్ 2022 ఐపీఎల్ వేలంలో రూ.55 లక్షలకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత 2025లో రాజస్థాన్ రాయల్స్కు మారిన అతన్ని, 2026 ఐపీఎల్ వేలంలో గుజరాత్ టైటాన్స్ రూ.90 లక్షలు వెచ్చించి సొంతం చేసుకుంది. ఇది అతనికి మూడో ఐపీఎల్ ఫ్రాంచైజీ.
కేవలం పేస్ మాత్రమే కాదు, వికెట్లు తీయడంలోనూ అశోక్ శర్మకు మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు 11 టీ20 మ్యాచ్ల్లో 33 వికెట్లు, 4 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 14 వికెట్లు, 7 లిస్ట్ ఏ మ్యాచ్ల్లో 13 వికెట్లు పడగొట్టాడు. పాట్ కమిన్స్ వంటి అనుభవజ్ఞులైన బౌలర్ల నుంచి సలహాలు తీసుకుంటూ తన పేస్ను మరింత మెరుగుపరుచుకుంటున్నాడు. అతడు సహజసిద్ధమైన పేస్, స్వింగ్ బౌలింగ్ తో భారత క్రికెట్ భవిష్యత్తుకు ఆశాకిరణంగా కనిపిస్తున్నాడని, త్వరలోనే జాతీయ జట్టు తలుపు తట్టగలడని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అతని ప్రదర్శనపై గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్లో భారీ ఆశలే పెట్టుకుంది.
అహ్మదాబాద్ వేదికగా శనివారం జరిగిన ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ మొదట బ్యాటింగ్ చేసింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 210 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (55), వైభవ్ సూర్యవంశి (31), ధ్రువ్ జురెల్ (75) రాణించారు. గుజరాత్ బౌలర్లలో రబాడా రెండు వికెట్లు తీశాడు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ 16వ ఓవర్ వేసిన అశోక్ శర్మ తన వేగంతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. అదే ఓవర్లో ఒక బంతిని 150.7 కి.మీ వేగంతో వేసిన అతను, చివరి బంతిని 154.2 కి.మీ వేగంతో విసిరి చరిత్ర సృష్టించాడు.
రాజస్థాన్కు చెందిన ఈ యువ మీడియం పేసర్, బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగల సామర్థ్యానికి, కచ్చితమైన లైన్ అండ్ లెంత్కు ప్రసిద్ధి. గతంలో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు నెట్ బౌలర్గా సేవలందించాడు. అతని ప్రతిభను గుర్తించిన కోల్కతా నైట్ రైడర్స్ 2022 ఐపీఎల్ వేలంలో రూ.55 లక్షలకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత 2025లో రాజస్థాన్ రాయల్స్కు మారిన అతన్ని, 2026 ఐపీఎల్ వేలంలో గుజరాత్ టైటాన్స్ రూ.90 లక్షలు వెచ్చించి సొంతం చేసుకుంది. ఇది అతనికి మూడో ఐపీఎల్ ఫ్రాంచైజీ.
కేవలం పేస్ మాత్రమే కాదు, వికెట్లు తీయడంలోనూ అశోక్ శర్మకు మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు 11 టీ20 మ్యాచ్ల్లో 33 వికెట్లు, 4 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 14 వికెట్లు, 7 లిస్ట్ ఏ మ్యాచ్ల్లో 13 వికెట్లు పడగొట్టాడు. పాట్ కమిన్స్ వంటి అనుభవజ్ఞులైన బౌలర్ల నుంచి సలహాలు తీసుకుంటూ తన పేస్ను మరింత మెరుగుపరుచుకుంటున్నాడు. అతడు సహజసిద్ధమైన పేస్, స్వింగ్ బౌలింగ్ తో భారత క్రికెట్ భవిష్యత్తుకు ఆశాకిరణంగా కనిపిస్తున్నాడని, త్వరలోనే జాతీయ జట్టు తలుపు తట్టగలడని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అతని ప్రదర్శనపై గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్లో భారీ ఆశలే పెట్టుకుంది.