Donald Trump: ఇరాన్తో యుద్ధం.. ట్రంప్ వ్యాఖ్యలతో తీవ్ర గందరగోళం
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర గందరగోళానికి దారితీశాయి. ఇరాన్ తమను కాల్పుల విరమణ కోరిందని ట్రంప్ ప్రకటించగా, ఆ వార్తలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలో, ఇరాన్పై అమెరికా వైఖరిని స్పష్టం చేస్తూ ట్రంప్ మరికొన్ని గంటల్లో (భారత కాలమానం ప్రకారం ఉదయం 6:30 గంటలకు) ప్రసంగించనున్నారు.
బుధవారం ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ కొత్త అధ్యక్షుడు తమను సంప్రదించి కాల్పుల విరమణ కోరినట్లు తెలిపారు. అయితే, హర్మూజ్ జలసంధిని స్వేచ్ఛగా తెరిచి ఉంచినప్పుడే ఈ ప్రతిపాదనను పరిశీలిస్తామని ఆయన షరతు పెట్టారు. అప్పటివరకు ఇరాన్ను రాతియుగంలోకి నెట్టేస్తామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే, ట్రంప్ వాదనలను ఇరాన్ విదేశాంగ శాఖ తోసిపుచ్చింది. అమెరికాను తాము కాల్పుల విరమణ కోరినట్లు వస్తున్న వార్తలు పూర్తిగా "అబద్ధం, నిరాధారం" అని స్పష్టం చేసింది. అలాంటి అభ్యర్థన ఏదీ చేయలేదని తేల్చి చెప్పింది.
ఇదిలా ఉండగా, యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులు దక్షిణ ఇజ్రాయెల్పై బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేశారు. ఇరాన్, హిజ్బుల్లాలతో సమన్వయంతోనే ఈ దాడికి పాల్పడినట్లు వారు ప్రకటించారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్, దాని మిత్రపక్షాలు ఉమ్మడి సైనిక చర్యలను ముమ్మరం చేయడంతో ఈ ఘర్షణ మరింత తీవ్రమవుతోంది. కేవలం రెండు, మూడు వారాల్లో యుద్ధం ముగియవచ్చని ట్రంప్ మంగళవారం అభిప్రాయపడిన మరుసటి రోజే ఈ పరస్పర విరుద్ధ ప్రకటనలు రావడం గమనార్హం.
బుధవారం ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ కొత్త అధ్యక్షుడు తమను సంప్రదించి కాల్పుల విరమణ కోరినట్లు తెలిపారు. అయితే, హర్మూజ్ జలసంధిని స్వేచ్ఛగా తెరిచి ఉంచినప్పుడే ఈ ప్రతిపాదనను పరిశీలిస్తామని ఆయన షరతు పెట్టారు. అప్పటివరకు ఇరాన్ను రాతియుగంలోకి నెట్టేస్తామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే, ట్రంప్ వాదనలను ఇరాన్ విదేశాంగ శాఖ తోసిపుచ్చింది. అమెరికాను తాము కాల్పుల విరమణ కోరినట్లు వస్తున్న వార్తలు పూర్తిగా "అబద్ధం, నిరాధారం" అని స్పష్టం చేసింది. అలాంటి అభ్యర్థన ఏదీ చేయలేదని తేల్చి చెప్పింది.
ఇదిలా ఉండగా, యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులు దక్షిణ ఇజ్రాయెల్పై బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేశారు. ఇరాన్, హిజ్బుల్లాలతో సమన్వయంతోనే ఈ దాడికి పాల్పడినట్లు వారు ప్రకటించారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్, దాని మిత్రపక్షాలు ఉమ్మడి సైనిక చర్యలను ముమ్మరం చేయడంతో ఈ ఘర్షణ మరింత తీవ్రమవుతోంది. కేవలం రెండు, మూడు వారాల్లో యుద్ధం ముగియవచ్చని ట్రంప్ మంగళవారం అభిప్రాయపడిన మరుసటి రోజే ఈ పరస్పర విరుద్ధ ప్రకటనలు రావడం గమనార్హం.