RCB: కాసేపట్లో ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్... బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద భారీ భద్రత
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్-2026) ఆరంభ మ్యాచ్కు బెంగళూరులోని ప్రఖ్యాత ఎం. చిన్నస్వామి స్టేడియం సర్వం సిద్ధమైంది. శనివారం సాయంత్రం డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనున్న ఈ మ్యాచ్ కోసం కనీవినీ ఎరుగని రీతిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. స్టేడియం, దాని పరిసర ప్రాంతాలు పోలీస్ కోటను తలపిస్తున్నాయి.
గతేడాది ఆర్సీబీ తొలిసారి ఐపీఎల్ గెలిచిన సందర్భంగా జరిగిన సంబరాల్లో తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయిన విషాదం నేపథ్యంలో ఈసారి కర్ణాటక ప్రభుత్వం, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (కేఎస్ సీఏ), ఆర్సీబీ యాజమాన్యం భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు సుమారు 2000 మంది పోలీసు సిబ్బందిని బందోబస్తు కోసం మోహరించారు. వీరిలో ఏడు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు.
భద్రతా ఏర్పాట్లను బెంగళూరు నగర జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (వెస్ట్ డివిజన్) వంశీ కృష్ణ పర్యవేక్షిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం నుంచే సిబ్బందిని నిర్దేశిత ప్రదేశాల్లో మోహరించారు. అభిమానుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాలినీ రజనీష్ శుక్రవారం రాత్రి ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. స్టేడియం లోపల, వెలుపల భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, పార్కింగ్ సౌకర్యాలు, తాగునీటి వంటి మౌలిక వసతులపై చర్చించారు.
ఈ సందర్భంగా బెంగళూరు పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ ఓ వీడియో సందేశం విడుదల చేశారు. "అభిమానులందరూ క్రీడాస్ఫూర్తిని ఆస్వాదించాలి. అదే సమయంలో పోలీసులు జారీ చేసిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలి. బాధ్యతాయుతంగా సంబరాలు జరుపుకోండి," అని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉండగా, కేఎస్ సీఏ, ఆర్సీబీ యాజమాన్యాలతో చర్చించి ప్రారంభ మ్యాచ్ కోసం ఎమ్మెల్యేలకు రెండేసి ఐపీఎల్ టిక్కెట్లు కేటాయించేలా ఏర్పాట్లు చేసినట్లు కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు.
గతేడాది ఆర్సీబీ తొలిసారి ఐపీఎల్ గెలిచిన సందర్భంగా జరిగిన సంబరాల్లో తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయిన విషాదం నేపథ్యంలో ఈసారి కర్ణాటక ప్రభుత్వం, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (కేఎస్ సీఏ), ఆర్సీబీ యాజమాన్యం భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు సుమారు 2000 మంది పోలీసు సిబ్బందిని బందోబస్తు కోసం మోహరించారు. వీరిలో ఏడు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు.
భద్రతా ఏర్పాట్లను బెంగళూరు నగర జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (వెస్ట్ డివిజన్) వంశీ కృష్ణ పర్యవేక్షిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం నుంచే సిబ్బందిని నిర్దేశిత ప్రదేశాల్లో మోహరించారు. అభిమానుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాలినీ రజనీష్ శుక్రవారం రాత్రి ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. స్టేడియం లోపల, వెలుపల భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, పార్కింగ్ సౌకర్యాలు, తాగునీటి వంటి మౌలిక వసతులపై చర్చించారు.
ఈ సందర్భంగా బెంగళూరు పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ ఓ వీడియో సందేశం విడుదల చేశారు. "అభిమానులందరూ క్రీడాస్ఫూర్తిని ఆస్వాదించాలి. అదే సమయంలో పోలీసులు జారీ చేసిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలి. బాధ్యతాయుతంగా సంబరాలు జరుపుకోండి," అని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉండగా, కేఎస్ సీఏ, ఆర్సీబీ యాజమాన్యాలతో చర్చించి ప్రారంభ మ్యాచ్ కోసం ఎమ్మెల్యేలకు రెండేసి ఐపీఎల్ టిక్కెట్లు కేటాయించేలా ఏర్పాట్లు చేసినట్లు కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు.