Bhanu Prakash Reddy: భక్తి ముసుగులో హింసను ప్రేరేపించడం దారుణం: భానుప్రకాశ్ రెడ్డి
పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై జరిగిన దాడి ప్రయత్నాన్ని టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాశ్రెడ్డి తీవ్రంగా ఖండించారు. తిరుపతి ప్రెస్క్లబ్లో మీడియాతో మాట్లాడిన ఆయన, రాజకీయ ప్రయోజనాల కోసం దాడులకు తెగబడటం ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు అని మండిపడ్డారు.
కొన్ని దుష్టశక్తులు ఆకివీడులో కావాలనే అరాచకాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూసే వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భక్తి ముసుగులో హింసను ప్రేరేపించడం అత్యంత దారుణమని ఆయన పేర్కొన్నారు.
ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు తాను త్వరలోనే ఆకివీడులో పర్యటిస్తానని, స్వయంగా ఘటనాస్థలిని పరిశీలిస్తానని భానుప్రకాశ్రెడ్డి వెల్లడించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారు ఎంతటి వారైనా చట్టం ముందు నిలబడాల్సిందేనని స్పష్టం చేశారు.