IndiGo: విశాఖ-ఢిల్లీ ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖపట్నం నుంచి ఢిల్లీ బయలుదేరిన ఇండిగో విమానంలో శనివారం ఉదయం సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పైలట్లు అప్రమత్తమై ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఆ సమయంలో విమానంలో 161 మంది ప్రయాణికులు ఉండగా, అందరూ సురక్షితంగా బయటపడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
వివరాల్లోకి వెళితే, ఇండిగోకు చెందిన 6ఈ 579 విమానం విశాఖ నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తుండగా, ల్యాండింగ్కు కొద్దిసేపటి ముందు ఇంజిన్లో సాంకేతిక సమస్యను పైలట్లు గుర్తించారు. వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ను సంప్రదించి, ప్రయారిటీ ల్యాండింగ్కు అనుమతి కోరారు. ఉదయం 10:54 గంటల సమయంలో విమానాశ్రయంలో ఫుల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. అగ్నిమాపక శకటాలను రన్వే వద్ద మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది.
ఈ ఘటనపై ఇండిగో సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. "ముందుజాగ్రత్త చర్యగా, ప్రామాణిక నిబంధనల ప్రకారం పైలట్లు ప్రయారిటీ ల్యాండింగ్ కోరారు. ప్రయాణికుల భద్రతే మా ప్రథమ ప్రాధాన్యత. ప్రస్తుతం విమానానికి అవసరమైన తనిఖీలు, మరమ్మతులు జరుగుతున్నాయి" అని ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు. ఇండిగో ఈ బోయింగ్ 737 విమానాన్ని టర్కీకి చెందిన కొరెండన్ ఎయిర్లైన్స్ నుంచి స్వల్పకాలిక లీజుకు తీసుకుంది.
వివరాల్లోకి వెళితే, ఇండిగోకు చెందిన 6ఈ 579 విమానం విశాఖ నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తుండగా, ల్యాండింగ్కు కొద్దిసేపటి ముందు ఇంజిన్లో సాంకేతిక సమస్యను పైలట్లు గుర్తించారు. వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ను సంప్రదించి, ప్రయారిటీ ల్యాండింగ్కు అనుమతి కోరారు. ఉదయం 10:54 గంటల సమయంలో విమానాశ్రయంలో ఫుల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. అగ్నిమాపక శకటాలను రన్వే వద్ద మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది.
ఈ ఘటనపై ఇండిగో సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. "ముందుజాగ్రత్త చర్యగా, ప్రామాణిక నిబంధనల ప్రకారం పైలట్లు ప్రయారిటీ ల్యాండింగ్ కోరారు. ప్రయాణికుల భద్రతే మా ప్రథమ ప్రాధాన్యత. ప్రస్తుతం విమానానికి అవసరమైన తనిఖీలు, మరమ్మతులు జరుగుతున్నాయి" అని ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు. ఇండిగో ఈ బోయింగ్ 737 విమానాన్ని టర్కీకి చెందిన కొరెండన్ ఎయిర్లైన్స్ నుంచి స్వల్పకాలిక లీజుకు తీసుకుంది.