Chandrababu Naidu: కఠిన సమయాల్లోనే నాయకత్వ పటిమ తెలుస్తుంది: ప్రధాని మోదీపై చంద్రబాబు ప్రశంసలు

Chandrababu praises PM Modi leadership during tough times
షార్ట్స్‌లో చూడండి
పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతించారు. ఇది ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకున్న బలమైన నిర్ణయమని ఆయన అభివర్ణించారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ట్వీట్‌ను చంద్రబాబు తన సోషల్ మీడియా ఖాతాలో రీపోస్ట్ చేస్తూ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

"కఠినమైన, సవాలుతో కూడిన సమయాల్లోనే నిజమైన నాయకత్వ పటిమ బయటపడుతుంది. నేను ఎప్పుడూ చెప్పే మాట ఇదే. ప్రపంచవ్యాప్తంగా క్లిష్ట పరిస్థితులు నెలకొన్నప్పటికీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం స్థిరంగా ముందుకు సాగుతోంది. అలాంటి నాయకుడు మనకు ఉండటం దేశ ప్రజల అదృష్టం.

ఈ రోజు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం అత్యంత బలమైన, ప్రజా కేంద్రకమైన చర్య. ఆంధ్రప్రదేశ్ తరఫున మేం ఈ నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. అంతర్జాతీయంగా పెరుగుతున్న ధరల ప్రభావం నుంచి సామాన్యుడిని రక్షించడానికి ఈ నిర్ణయం ఎంతగానో సహాయపడుతుంది.

నేడు అనేక దేశాలు తమ పౌరులపై ఇంధన ధరల భారాన్ని మోపుతుంటే, భారతదేశం మాత్రం తన ప్రజలకే ప్రథమ స్థానం ఇస్తూ ప్రత్యేకంగా నిలుస్తోంది. ప్రజల పట్ల ఎన్డీయే ప్రభుత్వానికి ఉన్న తిరుగులేని నిబద్ధతకు ఇదే నిదర్శనం" అంటూ చంద్రబాబు పేర్కొన్నారు.
Go Back to Shorts
Chandrababu Naidu
Narendra Modi
Petrol diesel price cut
Excise duty reduction
Fuel prices India
Andhra Pradesh
Amit Shah
Indian economy
NDA government
Public welfare

More Telugu News