500 కోట్ల భోజనాలు: అక్షయపాత్రకు సీఎం చంద్రబాబు ప్రశంసలు
- అక్షయపాత్ర ఫౌండేషన్కు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
- 25 ఏళ్లు పూర్తి చేసుకుని 500 కోట్ల భోజనాలు అందించడంపై ప్రశంస
- పీఎం పోషణ్, ఏపీలో అన్నా క్యాంటీన్ల ద్వారా సంస్థ సేవలను గుర్తింపు
- దేశ భవిష్యత్తుకు పోషణ అందిస్తోందని కొనియాడిన చంద్రబాబు
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, "రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి సమక్షంలో రాష్ట్రపతి భవన్లో ఈ మైలురాయిని చేరుకోవడం అభినందనీయం. అక్షయపాత్ర సమాజానికి, ముఖ్యంగా పిల్లలకు అందిస్తున్న సేవలు ఎనలేనివి" అని పేర్కొన్నారు. పీఎం పోషణ్ వంటి కార్యక్రమాలతో పాటు ఆంధ్రప్రదేశ్లో అన్నా క్యాంటీన్ల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు భోజనం అందించడంలో అక్షయపాత్ర కీలక భాగస్వామిగా ఉందని ఆయన గుర్తుచేశారు.
దేశ భవిష్యత్తుకు పోషణ అందిస్తున్న ఈ సంస్థ సేవలు "సుపోషిత్, సుశిక్షిత్, వికసిత్ భారత్" నిర్మాణానికి దోహదపడుతున్నాయని చంద్రబాబు కొనియాడారు. భవిష్యత్తులోనూ అక్షయపాత్ర మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.