పేలుళ్లతో దద్దరిల్లిన దుబాయ్.. కొనసాగుతున్న ఉద్రిక్తత
- దుబాయ్లో భారీ పేలుళ్లతో కంపించిన భవనాలు
- గాల్లోనే దాడిని అడ్డుకున్నామన్న అధికారులు
- ఒక భవనంపై పడిన శకలాలు, స్వల్ప నష్టం
- ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని వెల్లడి
నగరంలోని దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ (DIFC) వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. దాడిని గాల్లోనే విజయవంతంగా అడ్డుకున్నామని, దాని శకలాలు ఒక భవనం వెలుపలి భాగంపై పడటంతో స్వల్ప నష్టం వాటిల్లిందని దుబాయ్ మీడియా కార్యాలయం ఎక్స్ వేదికగా ప్రకటించింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు స్పష్టం చేశారు. ఒక భవనంపై శకలాలు పడినట్లు తాము కూడా భావిస్తున్నామని, పెద్ద పేలుడు శబ్దం వినిపించిందని ఏఎఫ్పీ ప్రతినిధి ఒకరు తెలిపారు.
ఘటన జరిగిన వెంటనే షేక్ జాయెద్ రోడ్డు వైపు నుంచి సైరన్ల మోత వినిపించింది. దుబాయ్ పోలీసులు వెంటనే ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. అధికారులు స్వల్ప నష్టమని చెప్పినప్పటికీ, భవనానికి గణనీయమైన నష్టం జరిగినట్లు తెలుస్తోంది. కాగా, గురువారం కూడా దుబాయ్లోని అల్ బదా ప్రాంతంలో ఒక "చిన్న డ్రోన్ ఘటన" చోటుచేసుకున్నట్లు అధికారులు ధ్రువీకరించారు.