ఇరాన్‌... ఓ వైపు యుద్ధం, మరోవైపు భూకంపం

  • దక్షిణ ఇరాన్‌లోని గెరాష్ ప్రాంతంలో భూకంపం
  • రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో కంపించిన భూమి
  • గెరాష్‌కు 55 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం
ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగుతుండగా, మరోవైపు ఇరాన్‌లో భూకంపం సంభవించింది. దక్షిణ ఇరాన్‌లోని గెరాష్ ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూమి కంపించింది. ఈ భూకంపం వల్ల ఆస్తి, ప్రాణ నష్టం గురించి వివరాలు తెలియాల్సి ఉంది. గెరాష్‌కు ఉత్తర వాయువ్య దిశలో 55 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు.

రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రత నమోదు కావడంతో ఈ భూకంపాన్ని తేలికపాటి నుంచి మధ్యస్థాయి భూకంపంగా తెలిపారు. భూకంపం వచ్చిన ప్రాంతం ఎక్కువగా గ్రామీణ ప్రాంతం. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగు పెట్టారు. ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ కాలేదు.


More Telugu News