Narendra Modi: మధ్యప్రాచ్యం ఉద్రిక్తతలపై ప్రధాని మోదీ అత్యవసర సమావేశం
- ఢిల్లీకి రాగానే అత్యవసరంగా సమావేశం కానున్న ప్రధాని మోదీ
- పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో సీసీఎస్ భేటీ
- ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి వార్తలతో పెరిగిన ఆందోళన
- గల్ఫ్ దేశాల్లోని భారతీయుల భద్రతపై ప్రధానంగా చర్చ
- రక్షణ, హోం, విదేశాంగ, ఆర్థిక మంత్రులతో కీలక సమీక్ష
రెండు రోజుల రాష్ట్రాల పర్యటన ముగించుకుని ఢిల్లీకి రాగానే ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో.. దేశ అత్యున్నత నిర్ణయాక వ్యవస్థ అయిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఎస్)తో ఆయన భేటీ కానున్నారు.
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా వైమానిక దాడులు చేయడం, ఇదే సమయంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించడంతో గల్ఫ్ ప్రాంతంలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఈ పరిణామాల దృష్ట్యా భారత్ అప్రమత్తమైంది. రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు, పుదుచ్చేరి పర్యటనలు ముగించుకుని రాత్రి 9:30 గంటల సమయంలో ప్రధాని ఢిల్లీ చేరుకుంటారు. వచ్చిన వెంటనే రక్షణ, హోం, విదేశాంగ, ఆర్థిక శాఖ మంత్రులతో కూడిన సీసీఎస్ బృందంతో సమావేశమవుతారు.
ఈ అత్యవసర భేటీలో ప్రధానంగా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, భారత్పై వాటి ప్రభావం గురించి చర్చించనున్నారు. ముఖ్యంగా యూఏఈ, ఇతర గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న లక్షలాది మంది భారతీయుల భద్రత, ఇంధన భద్రత (చమురు ధరలు), సముద్ర వాణిజ్య మార్గాల రక్షణ వంటి అంశాలపై సమీక్ష నిర్వహించనున్నారు. అవసరమైతే భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు (ఎవాక్యుయేషన్) తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపైనా చర్చ జరగనుంది.
అంతర్జాతీయంగా పరిస్థితులు వేగంగా మారుతున్న వేళ.. దేశ ప్రయోజనాలను కాపాడేందుకు, వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకునేందుకు మోదీ సర్కార్ ఈ సమావేశానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది.
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా వైమానిక దాడులు చేయడం, ఇదే సమయంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించడంతో గల్ఫ్ ప్రాంతంలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఈ పరిణామాల దృష్ట్యా భారత్ అప్రమత్తమైంది. రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు, పుదుచ్చేరి పర్యటనలు ముగించుకుని రాత్రి 9:30 గంటల సమయంలో ప్రధాని ఢిల్లీ చేరుకుంటారు. వచ్చిన వెంటనే రక్షణ, హోం, విదేశాంగ, ఆర్థిక శాఖ మంత్రులతో కూడిన సీసీఎస్ బృందంతో సమావేశమవుతారు.
ఈ అత్యవసర భేటీలో ప్రధానంగా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, భారత్పై వాటి ప్రభావం గురించి చర్చించనున్నారు. ముఖ్యంగా యూఏఈ, ఇతర గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న లక్షలాది మంది భారతీయుల భద్రత, ఇంధన భద్రత (చమురు ధరలు), సముద్ర వాణిజ్య మార్గాల రక్షణ వంటి అంశాలపై సమీక్ష నిర్వహించనున్నారు. అవసరమైతే భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు (ఎవాక్యుయేషన్) తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపైనా చర్చ జరగనుంది.
అంతర్జాతీయంగా పరిస్థితులు వేగంగా మారుతున్న వేళ.. దేశ ప్రయోజనాలను కాపాడేందుకు, వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకునేందుకు మోదీ సర్కార్ ఈ సమావేశానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది.