చమురు వ్యూహం మార్చిన భారత్
- వెనెజువెలా నుంచి ముడిచమురు కొనుగోలు ప్రారంభం
- చెరో 1 మిలియన్ బ్యారెళ్ల చమురు కొన్న బీపీసీఎల్, హెచ్ఎంఈఎల్
- కొచ్చి, బీనా, బటిండా రిఫైనరీలకు చేరనున్న చమురు
- చమురు దిగుమతికి అమెరికా నుంచి లైసెన్స్ పొందిన రిలయన్స్
దేశీయ ఇంధన అవసరాలను తీర్చుకోవడంలో భారత్ సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది. అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందాల నేపథ్యంలో.. రష్యా నుంచి దిగుమతులు తగ్గించి, వెనెజువెలా వైపు మొగ్గు చూపుతోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) తొలిసారిగా వెనెజువెలా నుంచి ముడిచమురు కొనుగోలు చేయగా, ప్రైవేటు సంస్థ హెచ్పీసీఎల్ మిట్టల్ ఎనర్జీ లిమిటెడ్ (హెచ్ఎంఈఎల్) రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ అక్కడి నుంచి దిగుమతులు చేపట్టింది.
కొనుగోలు వివరాలు..
అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఈ రెండు రిఫైనరీలు చెరో 1 మిలియన్ బ్యారెళ్ల చమురును కొనుగోలు చేశాయి. ప్రముఖ గ్లోబల్ ట్రేడర్ ‘విటోల్’ ద్వారా ఈ ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. అయితే, ఈ వ్యవహారంపై రెండు సంస్థల నుంచి స్పందన రావాల్సిఉంది. షిప్పింగ్ ఖర్చులను తగ్గించుకోవడానికి ఈ రెండు ఆర్డర్లను ఒకే భారీ నౌక (వీఎల్ సీసీ) ద్వారా భారత్కు తరలించనున్నారు. బీపీసీఎల్ ఈ చమురును కేరళలోని కొచ్చి మరియు గుజరాత్లోని బీనా రిఫైనరీలకు తరలించనుంది. హెచ్ఎంఈఎల్ దీనిని గుజరాత్లోని ముంద్రా పోర్ట్ ద్వారా పంజాబ్లోని బటిండా రిఫైనరీకి పంపనుంది.
అమెరికాతో వాణిజ్య ఒప్పందం..
ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై అదనపు సుంకాలను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా రష్యా చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేస్తుందని, దానికి బదులుగా అమెరికా మరియు వెనెజువెలా నుంచి చమురు దిగుమతులు పెంచుతుందని ట్రంప్ ప్రకటించారు. తాజా కొనుగోళ్లు ఈ ఒప్పందంలో భాగంగానే జరుగుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రయోజనాలు ఇవే..
వెనెజువెలా నుంచి లభించే ‘మెరీ’ గ్రేడ్ ముడిచమురుపై భారీగా డిస్కౌంట్లు లభించే అవకాశం ఉంది. రష్యాపై ఆధారపడటం తగ్గించి, చమురు వనరులను వైవిధ్యం చేసుకోవడం వల్ల దేశ ఇంధన భద్రత మరింత బలపడుతుంది. అమెరికా నేరుగా వెనెజువెలా చమురు విక్రయాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, భారతీయ రిఫైనరీలకు ఎటువంటి చట్టపరమైన ఇబ్బందులు లేకుండా తక్కువ ధరకు చమురు లభిస్తోంది.
గతంలో వెనెజువెలా నుంచి కొనుగోలు..
గతంలో 2019 వరకు వెనెజువెలా నుంచి భారత్ పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేసేది. అయితే అమెరికా ఆంక్షల వల్ల అది నిలిచిపోయింది. మళ్లీ ఇప్పుడు మారుతున్న రాజకీయ సమీకరణాల వల్ల ఈ వాణిజ్యం పుంజుకుంటోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఇప్పటికే వెనెజువెలా నుంచి నేరుగా చమురు దిగుమతి చేసుకునేందుకు అమెరికా నుంచి లైసెన్స్ పొందినట్లు సమాచారం.
కొనుగోలు వివరాలు..
అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఈ రెండు రిఫైనరీలు చెరో 1 మిలియన్ బ్యారెళ్ల చమురును కొనుగోలు చేశాయి. ప్రముఖ గ్లోబల్ ట్రేడర్ ‘విటోల్’ ద్వారా ఈ ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. అయితే, ఈ వ్యవహారంపై రెండు సంస్థల నుంచి స్పందన రావాల్సిఉంది. షిప్పింగ్ ఖర్చులను తగ్గించుకోవడానికి ఈ రెండు ఆర్డర్లను ఒకే భారీ నౌక (వీఎల్ సీసీ) ద్వారా భారత్కు తరలించనున్నారు. బీపీసీఎల్ ఈ చమురును కేరళలోని కొచ్చి మరియు గుజరాత్లోని బీనా రిఫైనరీలకు తరలించనుంది. హెచ్ఎంఈఎల్ దీనిని గుజరాత్లోని ముంద్రా పోర్ట్ ద్వారా పంజాబ్లోని బటిండా రిఫైనరీకి పంపనుంది.
అమెరికాతో వాణిజ్య ఒప్పందం..
ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై అదనపు సుంకాలను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా రష్యా చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేస్తుందని, దానికి బదులుగా అమెరికా మరియు వెనెజువెలా నుంచి చమురు దిగుమతులు పెంచుతుందని ట్రంప్ ప్రకటించారు. తాజా కొనుగోళ్లు ఈ ఒప్పందంలో భాగంగానే జరుగుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రయోజనాలు ఇవే..
వెనెజువెలా నుంచి లభించే ‘మెరీ’ గ్రేడ్ ముడిచమురుపై భారీగా డిస్కౌంట్లు లభించే అవకాశం ఉంది. రష్యాపై ఆధారపడటం తగ్గించి, చమురు వనరులను వైవిధ్యం చేసుకోవడం వల్ల దేశ ఇంధన భద్రత మరింత బలపడుతుంది. అమెరికా నేరుగా వెనెజువెలా చమురు విక్రయాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, భారతీయ రిఫైనరీలకు ఎటువంటి చట్టపరమైన ఇబ్బందులు లేకుండా తక్కువ ధరకు చమురు లభిస్తోంది.
గతంలో వెనెజువెలా నుంచి కొనుగోలు..
గతంలో 2019 వరకు వెనెజువెలా నుంచి భారత్ పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేసేది. అయితే అమెరికా ఆంక్షల వల్ల అది నిలిచిపోయింది. మళ్లీ ఇప్పుడు మారుతున్న రాజకీయ సమీకరణాల వల్ల ఈ వాణిజ్యం పుంజుకుంటోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఇప్పటికే వెనెజువెలా నుంచి నేరుగా చమురు దిగుమతి చేసుకునేందుకు అమెరికా నుంచి లైసెన్స్ పొందినట్లు సమాచారం.