Kolusu Parthasarathy: చంద్రబాబుతో ఉంటే బిల్ గేట్స్‌ను కలుస్తారు... జగన్‌ను నమ్ముకుంటే గేటు బయటే ఉంటారు: మంత్రి పార్థసారథి

Kolusu Parthasarathy comments on Chandrababu and Jagan
  • చంద్రబాబు, జగన్ తీరును పోలుస్తూ రెండు ఫొటోలతో పార్థసారథి సోషల్ మీడియాలో పోస్ట్
  • అమరావతిలో చంద్రబాబుతో భేటీ అయిన మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్
  • డిజిటల్ పాలనలో చంద్రబాబు కృషి అమోఘమని బిల్ గేట్స్ ప్రశంస
  • భారత డిజిటల్ విప్లవంలో మోదీ, చంద్రబాబు కీలకపాత్రధారులని కితాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "చంద్రబాబు గారితో ఉంటే బిల్ గేట్స్‌ను కలుస్తారు… జగన్‌ను నమ్ముకుంటే గేటు బయటే ఉంటారు" అంటూ సోషల్ మీడియా వేదికగా ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన రెండు ఫొటోలను పోలుస్తూ ఒక పోస్ట్ పెట్టారు.

ఒక ఫొటోలో వైసీపీ అధినేత జగన్ తన ఇంటి నుంచి బయటకు వస్తుండగా, పలువురు వైసీపీ నేతలు గేటు బయట వేచి ఉన్న దృశ్యాన్ని మంత్రి పంచుకున్నారు. మరో ఫొటోలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌తో పాటు తాను, ఇతర మంత్రులు కలిసి ఉన్న చిత్రాన్ని జతచేశారు. ఈ రెండు చిత్రాలను పోలుస్తూ ఆయన పైవిధంగా వ్యాఖ్యానించారు.

సోమవారం అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో బిల్ గేట్స్ సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటు మంత్రి పార్థసారథి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిల్ గేట్స్ మాట్లాడుతూ, భారతదేశ డిజిటల్ విప్లవంలో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు.

ముఖ్యంగా డిజిటల్ గవర్నెన్స్, విపత్తుల నిర్వహణలో టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించడంలో చంద్రబాబు చేస్తున్న కృషిని బిల్ గేట్స్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కీలక సమావేశం జరిగిన నేపథ్యంలోనే మంత్రి పార్థసారథి చేసిన పోస్ట్ రాజకీయంగా చర్చనీయాంశమైంది.
Kolusu Parthasarathy
Chandrababu Naidu
Jagan Mohan Reddy
Bill Gates
Andhra Pradesh
AP Politics
Digital Governance
Narendra Modi
Microsoft
Amaravati

More Telugu News