India vs Pakistan: భారత్ గెలుపును సెలెబ్రేట్ చేసుకున్న ఆప్ఘనిస్థాన్, బెలూచిస్థాన్ ప్రజలు

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ గెలుపును మన దేశంతో పాటు ఆప్ఘనిస్థాన్‌లోనూ సంబరాలు జరుపుకున్నారు. అలాగే తమకు ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ చేస్తున్న పాక్ లోని బెలూచిస్థాన్ ప్రజలు కూడా ఈ గెలుపు నేపథ్యంలో వేడుకలు చేసుకున్నారు.

పాకిస్థాన్ 61 పరుగుల తేడాతో ఓడిపోయిందని తెలియడంతో బెలూచ్ ప్రజలు ఎంతో ఉత్సాహంగా సంప్రదాయ నృత్యాలతో సంబరాలు చేసుకున్నారు. భారత్ విజయం పట్ల వారు బాహాటంగా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఆప్ఘనిస్థాన్‌లోనూ ప్రజలు రహదారుల పైకి వచ్చి గట్టిగా అరుస్తూ సంబరాలు చేసుకున్నారు.
India vs Pakistan
T20 World Cup
Afghanistan
Balochistan
India win celebrations
Pakistan defeat

More Telugu News