Mahesh Kumar Goud: నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లను మేమే కైవసం చేసుకుంటాం: మహేశ్ కుమార్ గౌడ్

Mahesh Kumar Goud Confident of Winning Nizamabad Karimnagar Corporations
షార్ట్స్‌లో చూడండి
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఎన్నికల ఫలితాలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సంతృప్తిని వ్యక్తం చేశారు. నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లను కూడా తామే కైవసం చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కొత్తగూడెం కార్పొరేషన్ విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఈరోజు సమావేశమవుతానని... ఈ భేటీలో కార్పొరేషన్లపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.   

ఈ ఎన్నికలు కల్వకుంట్ల కవితకు సంతోషాన్ని ఇచ్చి ఉండవచ్చని మహేశ్ గౌడ్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ రోజురోజుకు పతనమవుతోందని... రాబోయే రోజుల్లో ఆ పార్టీ ప్రభావం ఉండదని చెప్పారు. మతాన్ని రెచ్చగొట్టినా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఏమీ సాధించలేకపోయిందని ఎద్దేవా చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు, ఈ ఎన్నికల ఫలితాలతో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన పట్టును మరింత పెంచుకున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Go Back to Shorts
Mahesh Kumar Goud
Nizamabad
Karimnagar
Congress Party
Revanth Reddy
BRS Party
Municipal Elections
Telangana Politics
K Kavitha
GHMC Elections

More Telugu News