Botsa Satyanarayana: శాసనమండలి నుంచి వైసీపీ వాకౌట్

YSRCP Stages Walkout Over Land Allotment in Visakhapatnam
షార్ట్స్‌లో చూడండి
విశాఖలో ఐటీ కంపెనీలకు 99 పైసలకే భూములు కేటాయించడంపై ఏపీ శాసనమండలిలో వాడీవేడి చర్చ జరిగింది. రియలెస్టేట్ కంపెనీలకు స్థలాలు ఎలా ఇస్తారంటూ వైసీపీ ప్రశ్నించింది. దీనిపై మంత్రులు నారా లోకేశ్, అచ్చెన్నాయుడు వివరణ ఇచ్చారు. ఏపీకి కంపెనీలు రావడం వైసీపీకి నచ్చదని నారా లోకేశ్ విమర్శించారు. విశాఖలో ఎకో సిస్టమ్ తయారుచేయాలంటే పెద్ద కంపెనీలు రావాలని... అందుకే ఐదు కంపెనీలకు భూములు లీజుకిచ్చామని తెలిపారు. విశాఖలో 5 లక్షల ఐటీ ఉద్యోగాలను కల్పిస్తామని చెప్పారు.

ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ... ఇతర రాష్ట్రాల్లో కోట్లు పెట్టి కంపెనీలు భూములు కొంటుంటే... విశాఖలో విలువైన భూములను అతి తక్కువ ధరకే అప్పగిస్తున్నారని విమర్శించారు. గీతం యూనివర్శిటీకి రూ. 5 వేల కోట్ల విలువైన భూములను ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఈ అంశంపై అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. ప్రభుత్వం భూదోపిడీకి పాల్పడుతోందని బొత్స అన్నారు. గీతంకు భూముల కేటాయింపును నిరసిస్తూ సభ నుంచి వైసీపీ వాకౌట్ చేసింది. అనంతరం నారా లోకేశ్ మాట్లాడుతూ... వైసీపీకి వాకౌట్ చేయడం అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. ఈ తలుపు నుంచి వచ్చి ఆ తలుపు నుంచి వెళ్లిపోవడం బొత్స సత్యనారాయణకు అలవాటేనని అన్నారు.
Go Back to Shorts
Botsa Satyanarayana
Andhra Pradesh
Visakhapatnam
AP Legislative Council
Nara Lokesh
YSRCP Walkout
IT Companies
Land Allotment
GITAM University
Real Estate

More Telugu News