అజిత్ పవార్ అంతిమయాత్రలో చోరీ.. ఏడుగురి అరెస్టు

Theft During Ajit Pawar Funeral Seven Arrested
  • అజిత్ పవార్ అంతిమయాత్రలో పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు
  • బంగారం, ఖరీదైన వస్తువులు పోయినట్లు 15 మంది ఫిర్యాదు
  • ఏడుగురు అనుమానితులను అరెస్టు చేసిన పోలీసులు
విమాన ప్రమాదంలో మృతి చెందిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అంత్యక్రియలు గత గురువారం బారామతి విద్యాప్రతిష్ఠాన్ మైదానంలో జరిగాయి. ఆ సమయంలో కొంతమంది దొంగలు చేతివాటం ప్రదర్శించారు. అజిత్ పవార్ అంతిమయాత్రలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అంత్యక్రియల అనంతరం పదిహేను మంది తమ బంగారం, ఇతర ఖరీదైన వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

చోరీకి గురైన వస్తువుల విలువ సుమారు రూ.30 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మంగళవారం ఏడుగురు అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. 
Advertisement
Ajit Pawar
Ajit Pawar funeral
Maharashtra Deputy Chief Minister
Theft at funeral
Crime news
Vidya Pratishthan

More Telugu News