మహిళా ఐఏఎస్‌పై మీడియాలో కథనం.. తీవ్రంగా స్పందించిన సజ్జనార్

  • మహిళల ప్రతిష్ఠను దెబ్బతీయడాన్ని ఖండించాలన్న సజ్జనార్
  • ఉద్దేశపూర్వకంగా దాడులు ఆందోళనకరమని వ్యాఖ్య
  • వ్యక్తిత్వంపై దాడి అంటే పురోగతిపై దాడి చేసినట్లేనని వ్యాఖ్య
మహిళల, రాజకీయ నాయకుల ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యవహరించడం సరికాదని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ అన్నారు. ఇటీవల ఓ మహిళా ఐఏఎస్ అధికారి, ఒక మంత్రిపై మీడియాలో వచ్చిన కథనాలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ అంశంపై ఆయన స్పందిస్తూ, మీడియా ద్వారా మహిళల ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నాలను ఖండించాలని కోరారు.

మహిళా అధికారులపై ఉద్దేశపూర్వకంగా దాడులు చేయడం ఆందోళన కలిగిస్తోందని ఆయన అన్నారు. ప్రజా జీవితంలో మహిళలను అవమానించడం క్రూరత్వమని, మహిళా ఉద్యోగులపై వ్యక్తిగత దూషణలు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. ఒక వ్యక్తి వ్యక్తిత్వంపై దాడి చేయడం అంటే వారి పురోగతిని అడ్డుకోవడమేనని పేర్కొన్నారు. మహిళలను గౌరవించని సమాజం భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని హెచ్చరించారు. భవిష్యత్తు అంతా మహిళలదేనని గుర్తెరగాలని ఆయన సూచించారు.

Sajjanar
Sajjanar IPS
Hyderabad CP Sajjanar
IAS officers
Women IAS officers
Media reports

More Telugu News