మావోయిస్టులకు మరో షాక్.. ఎన్కౌంటర్ లో ముగ్గురు మావోల మృతి
- ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో ఎదురుకాల్పులు
- గొల్లపల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాల ఆపరేషన్
- ఇంకా కొనసాగుతున్న గాలింపు చర్యలు
వివరాల్లోకి వెళితే.. సుక్మా జిల్లాలోని గొల్లపల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. బలగాలు అడవిని జల్లెడ పడుతుండగా, మావోయిస్టులు వారిపై కాల్పులు జరిపారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే ఎదురుకాల్పులు ప్రారంభించారు.
ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు అక్కడికక్కడే మరణించారు. ఘటనా స్థలంలో ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, ఆపరేషన్ ముగిసిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ మధ్యకాలంలో ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టుల ఏరివేత కార్యక్రమాన్ని భద్రతా బలగాలు ముమ్మరం చేసిన విషయం తెలిసిందే.