రాజీవ్, ఇందిర పేర్లేనా.. శ్రీకాంతాచారి పేరు ఏది?: కవిత ఫైర్
- ఒక్క ప్రాజెక్టుకైనా శ్రీకాంతాచారి పేరు పెట్టారా? అని కాంగ్రెస్ను ప్రశ్నించిన కవిత
- అమరులను గౌరవిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి విస్మరించారని విమర్శ
- ప్రాజెక్టులకు రాజీవ్, ఇందిర, మన్మోహన్ పేర్లు పెడుతున్నారని ఆరోపణ
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులకు రాజీవ్గాంధీ, ఇందిరాగాంధీ, మన్మోహన్ సింగ్ వంటి వారి పేర్లను పెడుతోందే తప్ప, తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన వారిని గుర్తించడం లేదని ఆరోపించారు.
నిజమైన త్యాగాలు చేసిన తెలంగాణ బిడ్డల పేర్లు చిరస్థాయిగా నిలిచిపోయేలా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని కవిత అన్నారు. తెలంగాణ జాగృతి ఎల్లప్పుడూ అమరుల ఆశయ సాధన కోసం, వారి త్యాగాలను స్మరించుకోవడం కోసం పనిచేస్తుందని ఆమె స్పష్టం చేశారు.