నటించిన ప్రతి పాత్రలో ధర్మేంద్ర జీవించారు: ప్రధాని మోదీ
- దిగ్గజ నటుడు ధర్మేంద్ర మృతిపై ప్రధాని మోదీ స్పందన
- ఆయన మరణంతో భారత సినీ రంగంలో ఒక శకం ముగిసిందని వ్యాఖ్య
- విభిన్న పాత్రలతో కోట్లాది మంది ప్రజల హృదయాలను గెలుచుకున్నారని కొనియాడారు
- ధర్మేంద్ర నిరాడంబరత, వినయం ఎందరికో ఆదర్శమని వెల్లడి
ఈ సందర్భంగా ప్రధాని మోదీ తన సంతాప సందేశాన్ని విడుదల చేశారు. "ధర్మేంద్ర జీ మరణం భారత సినిమాలో ఒక శకం ముగింపు. ఆయన ఒక ఐకానిక్ ఫిల్మ్ పర్సనాలిటీ. ప్రతి పాత్రకు తన అద్భుతమైన నటనతో జీవం పోసి, ఆకట్టుకున్నారు. ఆయన పోషించిన విభిన్న పాత్రలు అసంఖ్యాక ప్రజల హృదయాలను హత్తుకున్నాయి. ధర్మేంద్ర జీ తన నిరాడంబరత, వినయం, ఆప్యాయతతో కూడా ఎంతగానో గౌరవాభిమానాలు పొందారు. ఈ విషాద సమయంలో, నా ఆలోచనలు ఆయన కుటుంబం, స్నేహితులు, అసంఖ్యాక అభిమానులతో ఉన్నాయి. ఓం శాంతి" అని ప్రధాని పేర్కొన్నారు.
ధర్మేంద్ర తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో మరపురాని పాత్రలతో ప్రేక్షకులను అలరించారని, ఆయన లేని లోటు తీర్చలేనిదని మోదీ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.