Chhattisgarh train accident: పాసింజర్ రైలు రెడ్ సిగ్నల్ను జంప్ చేయడం వల్లే ప్రమాదం!: ఛత్తీస్గఢ్ రైలు ప్రమాదంపై రైల్వే బోర్డు
- వెనుక నుంచి గూడ్సు రైలును ఢీకొట్టిన ప్రయాణికుల రైలు
- మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున నష్టపరిహారం
- గాయపడిన వారికి రూ. 5 లక్షలు
ఛత్తీస్గఢ్ రైలు ప్రమాదానికి ప్రయాణికుల రైలు రెడ్ సిగ్నల్ దాటి ముందుకు వెళ్లడమే కారణమని రైల్వే బోర్డు ప్రాథమికంగా నిర్ధారించింది. బిలాస్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన ఈ దుర్ఘటనలో ప్రయాణికుల రైలు వెనుక నుంచి గూడ్సు రైలును ఢీకొనడంతో ఏడుగురు మృతి చెందగా, 14 మంది గాయపడ్డారు.
కోర్బా జిల్లాలోని గెవరా నుండి బిలాస్పూర్కు ప్రయాణికుల రైలు వెళుతుండగా గటోరా-బిలాస్పూర్ స్టేషన్ మధ్య ఈ ప్రమాదం సంభవించింది. గూడ్స్ రైలు కూడా అదే దిశలో కదులుతోందని అధికారులు పేర్కొన్నారు.
మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ రూ. 10 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ. 5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 1 లక్ష చొప్పున సహాయం అందించనున్నట్లు తెలిపింది. ఈ దుర్ఘటనపై రైల్వే భద్రతా కమిషనర్ స్థాయి విచారణకు ఆదేశించినట్లు వెల్లడించింది.
కోర్బా జిల్లాలోని గెవరా నుండి బిలాస్పూర్కు ప్రయాణికుల రైలు వెళుతుండగా గటోరా-బిలాస్పూర్ స్టేషన్ మధ్య ఈ ప్రమాదం సంభవించింది. గూడ్స్ రైలు కూడా అదే దిశలో కదులుతోందని అధికారులు పేర్కొన్నారు.
మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ రూ. 10 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ. 5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 1 లక్ష చొప్పున సహాయం అందించనున్నట్లు తెలిపింది. ఈ దుర్ఘటనపై రైల్వే భద్రతా కమిషనర్ స్థాయి విచారణకు ఆదేశించినట్లు వెల్లడించింది.