Pawan Kalyan: సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Pawan Kalyan Thanks CM Chandrababu for Fishermen Relief
  • వేటకు వెళ్లి మరణించిన 18 మత్స్యకారుల కుటుంబాలకు సాయం
  • ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున పరిహారం
  • మొత్తం రూ. 90 లక్షలు మంజూరు చేసిన ప్రభుత్వం
  • ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేక చొరవ
  • కాకినాడ జిల్లాకు చెందిన బాధిత కుటుంబాలకు అండ
  • సహకరించిన సీఎం చంద్రబాబుకు పవన్ కల్యాణ్ ధన్యవాదాలు
సముద్రంలో వేటకు వెళ్లి ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలిచింది. కాకినాడ జిల్లాకు చెందిన 18 బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ప్రకటించింది.

ఈ మేరకు, ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున మొత్తం రూ. 90 లక్షల పరిహారాన్ని కూటమి ప్రభుత్వం మంజూరు చేసింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుని, బాధిత కుటుంబాలకు తక్షణ సాయం అందేలా కీలక పాత్ర పోషించారు.

సముద్రంలోకి చేపల వేటకు వెళ్లి, దురదృష్టవశాత్తు ప్రాణాలు విడిచిన ఈ మత్స్యకారుల కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మత్స్యకారుల కుటుంబాలకు అండగా నిలిచి, పరిహారం మంజూరుకు సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ప్రభుత్వం ప్రకటించిన ఈ ఆర్థిక సాయం బాధిత కుటుంబాలకు కొంతమేర ఊరట కలిగించనుంది.
Pawan Kalyan
Chandrababu Naidu
Andhra Pradesh
Fishermen
Kakinada
Ex gratia
Financial Assistance
Accidental Death
AP Government

More Telugu News