GS Malik: విమాన ప్రమాదం మృతుల సంఖ్య ఇప్పుడే చెప్పలేం.. ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు: అహ్మదాబాద్ సీపీ

GS Malik Plane Crash Death Toll Uncertain One Survivor Found
షార్ట్స్‌లో చూడండి
విమాన ప్రమాదంలో మరణించిన వారి సంఖ్యపై ఇప్పుడే స్పష్టత ఇవ్వలేమని అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ జి.ఎస్. మాలిక్ తెలిపారు. ప్రమాద సమయంలో విమానంలో సిబ్బందితో సహా మొత్తం 242 మంది ఉన్నారని, వారిలో ఒకరు ప్రాణాలతో బయటపడ్డారని ఆయన వెల్లడించారు.

వివరాల్లోకి వెళితే, ప్రమాదానికి గురైన విమానంలో 11ఏ సీట్లో ప్రయాణిస్తున్న వ్యక్తి సురక్షితంగా బయటపడ్డాడని, ప్రస్తుతం అతనికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని పోలీస్ కమిషనర్ తెలిపారు. విమానం జనావాసాలున్న ప్రాంతంలో కూలిపోవడం వల్ల అక్కడ కూడా కొందరు మరణించి ఉండవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఇళ్లు, కార్యాలయాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, మృతుల సంఖ్యను ఇప్పుడే కచ్చితంగా చెప్పడం కష్టసాధ్యమని మాలిక్ పునరుద్ఘాటించారు.

ప్రమాద సమయంలో విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ పౌరులు, ఏడుగురు పోర్చుగల్ దేశస్థులు, కెనడాకు చెందిన ఒక ప్రయాణికుడు ఉన్నారు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఇదే విమానంలో ప్రయాణిస్తూ మృత్యువాత పడ్డారు. మరోవైపు, విమానం కుప్పకూలిన ప్రదేశంలో ఉన్న బీజే మెడికల్ కళాశాల హాస్టల్‌లోని కొందరు విద్యార్థులు కూడా ఈ దుర్ఘటనలో మరణించినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Go Back to Shorts
GS Malik
Ahmedabad plane crash
plane crash India
Gujarat plane accident
Vijay Rupani

More Telugu News