China Earthquake: చైనా, టిబెట్‌లలో భూకంపం

China and Tibet Hit by Earthquakes
షార్ట్స్‌లో చూడండి
చైనాలో ఆదివారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.5గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్సీఎస్) వెల్లడించింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 11 గంటలకు ఈ భూకంపం సంభవించినట్లు ఎన్సీఎస్ ట్వీట్ చేసింది. భూగర్భంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. అయితే, ఈ ఘటనలో తక్షణ ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టంపై ఎలాంటి నివేదికలు అందలేదని అధికారులు తెలిపారు.

టిబెట్‌లో కూడా ఆదివారం రెండుసార్లు భూమి కంపించినట్లు ఎన్సీఎస్ తెలిపింది. మొదటి భూకంపం 3.8 తీవ్రతతో మధ్యాహ్నం 1:14 గంటలకు సంభవించగా, రెండోసారి సాయంత్రం 5:07 గంటలకు మరోసారి భూమి కంపించింది. దీని తీవ్రత 3.7గా నమోదైందని అధికారులు వెల్లడించారు. టిబెటన్ పీఠభూమి ప్రాంతం భూకంపాలకు నిలయంగా ఉంటుందని, టెక్టోనిక్ ప్లేట్ల కదలికల కారణంగా ఇక్కడ తరచూ భూ ప్రకంపనలు సంభవిస్తాయని భౌగోళిక శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. తాజా భూకంపాల వల్ల ఎలాంటి నష్టం వాటిల్లిందనే దానిపై పూర్తి సమాచారం ఇంకా అందాల్సి ఉంది.
Go Back to Shorts
China Earthquake
Tibet Earthquake
National Center for Seismology
NCS
Earthquake
Seismic Activity
tectonic plates
Tibetan Plateau
earthquake intensity
Richter Scale

More Telugu News