గచ్చిబౌలిలో హైడ్రా బుల్డోజర్లు.. అక్రమ కట్టడాల కూల్చివేతలు

  • సంధ్య కన్వెన్షన్ లోని మినీ హాల్ కూల్చివేత
  • ఉదయాన్నే మూడు భారీ బుల్డోజర్లతో గచ్చిబౌలికి అధికారులు
  • పోలీస్ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు నేలమట్టం
హైదరాబాద్ లో మరోసారి హైడ్రా కూల్చివేతలు మొదలయ్యాయి. ఈసారి గచ్చిబౌలిలోని అక్రమ కట్టడాలపై అధికారులు గురిపెట్టారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి కట్టిన భారీ భవనాలను నేలమట్టం చేస్తున్నారు. మంగళవారం ఉదయాన్నే గచ్చిబౌలి చేరుకున్న అధికారులు.. సంధ్య కన్వెన్షన్ లో అక్రమంగా నిర్మించిన మినీ హాల్ ను కూల్చివేశారు. ఫుడ్ కోర్టును కూడా తొలగించారు. మూడు భారీ బుల్డోజర్లతో గచ్చిబౌలిలో కూల్చివేతలు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. కూల్చివేతలపై ఆందోళన చేస్తున్న వారిని అదుపు చేయడానికి పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయిస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్ పరిధిలో కూల్చివేతలు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకున్నా ఈ లేఅవుట్ లో రోడ్లు, పార్కులు, స్థలాలను ఆక్రమించి భవనాలు నిర్మించినట్లు పేర్కొన్నారు. తాజాగా ఈ అక్రమ నిర్మాణాల తొలగింపును చేపట్టినట్లు వివరించారు. సంధ్య కన్వెన్షన్ లో అక్రమంగా నిర్మించిన వంటగదులు, రెస్ట్‌ రూములు, మినీ హాల్ వంటి నిర్మాణాలను నేలమట్టం చేసినట్లు తెలిపారు.


More Telugu News