Ram Charan: లండన్ లో రామ్ చరణ్ మైనపు విగ్రహం ఆవిష్కరణ... తరలివెళ్లిన మెగా ఫ్యామిలీ.. ఫొటో ఇదిగో!

Ram Charans Wax Statue Unveiling in London

  • లండన్‌ మేడమ్ టుస్సాడ్స్‌లో రామ్ చరణ్ మైనపు విగ్రహం
  • విగ్రహావిష్కరణ కార్యక్రమం కోసం లండన్ ప్రయాణం
  • భార్య ఉపాసన, కుమార్తె క్లీంకారతో చరణ్
  • చిరంజీవి, సురేఖ కూడా పయనం
  • గ్లోబల్ స్టార్‌గా చరణ్‌కు దక్కిన మరో గుర్తింపు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అరుదైన గౌరవాన్ని అందుకోబోతున్నారు. లండన్‌లోని ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు రామ్ చరణ్ తన కుటుంబ సభ్యులతో కలిసి లండన్‌కు బయలుదేరి వెళ్లారు.

వివరాల్లోకి వెళితే, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రముఖుల మైనపు విగ్రహాలకు లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ఎంతో ప్రసిద్ధి. ఈ ప్రతిష్ఠాత్మక మ్యూజియంలో ఇప్పుడు టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మైనపు విగ్రహం కూడా కొలువుదీరనుంది. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యేందుకు రామ్ చరణ్, ఆయన అర్ధాంగి ఉపాసన కామినేని కొణిదెల, గారాల పట్టి క్లీంకార కొణిదెల... మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతలు లండన్ పయనమయ్యారు.

రామ్ చరణ్ 'RRR' చిత్రంతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుండటం తెలుగు సినీ పరిశ్రమకు, ఆయన అభిమానులకు గర్వకారణంగా మారింది. ఈ విగ్రహం ఎలా ఉండబోతుందోనని, ఆవిష్కరణ కార్యక్రమం ఎప్పుడు జరుగుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మేడమ్ టుస్సాడ్స్‌లో చోటు దక్కించుకున్న అతి కొద్ది మంది భారతీయ ప్రముఖుల సరసన రామ్ చరణ్ చేరనుండటం గమనార్హం.

Ram Charan
Madame Tussauds
London
Wax Statue
Mega Family
Chiranjeevi
Upasana Kamineni Konidela
RRR Movie
Tollywood
Global Star
  • Loading...

More Telugu News