Delhi Capitals: మెరిసిన ఢిల్లీ టాపార్డర్... లక్నో జట్టుపై ఈజీ విన్

Delhi Capitals Easy Win Over Lucknow Super Giants in IPL 2025

  • లక్నోలో మ్యాచ్
  • 8 వికెట్ల  తేడాతో నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్
  • 160 పరుగుల లక్ష్యాన్ని 17.5 ఓవర్లలో కొట్టేసిన ఢిల్లీ టీమ్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకానా క్రికెట్ స్టేడియంలో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ బౌలింగ్, బ్యాటింగ్‌లో సమష్టిగా రాణించి సునాయాసంగా గెలుపొందింది.

టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. 

అనంతరం 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 17.5 ఓవర్లలోనే 161 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. 

ఓపెనర్ కరుణ్ నాయర్ (15) త్వరగానే ఔటైనా, మరో ఓపెనర్ అభిషేక్ పోరెల్ (36 బంతుల్లో 51; 5 ఫోర్లు, 1 సిక్సర్), వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (42 బంతుల్లో 57 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో మెరిశారు. రెండో వికెట్‌కు వీరిద్దరూ కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. 

పోరెల్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ అక్షర్ పటేల్ (20 బంతుల్లో 34 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్సర్లు) దూకుడుగా ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. రాహుల్ చివరి వరకు అజేయంగా నిలిచి జట్టు విజయంలో ముఖ్య భూమిక పోషించాడు. లక్నో బౌలర్లలో ఐడెన్ మార్క్రమ్ రెండు వికెట్లు పడగొట్టాడు.

Delhi Capitals
IPL 2025
Lucknow Super Giants
Axar Patel
KL Rahul
Abhishek Porel
Cricket Match
India
T20 Cricket
Indian Premier League
  • Loading...

More Telugu News