RS Praveen Kumar: ఆరోజు మిగిలేది రేవంత్ రెడ్డి, ఆయన అసిస్టెంట్లు మాత్రమే: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

- ఏప్రిల్ 27న వరంగల్ లో బీఆర్ఎస్ సిల్వర్ జుబ్లీ సభ
- ఆ రోజు యావత్ తెలంగాణ వరంగల్ లో ఉంటుందన్న ప్రవీణ్ కుమార్
- గాంధీ భవన్ లో లైవ్ చూస్తూ కాలక్షేపం చేయాలని ఎద్దేవా
ఏప్రిల్ 27న వరంగల్ లో బీఆర్ఎస్ సిల్వర్ జుబ్లీ వేడుకలు జరగనున్న సంగతి తెలిసిందే. ఆ సభ గ్రాండ్ సక్సెస్ అవుతుందనే ధీమాలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. మరోవైపు బీఆర్ఎస్ రజతోత్సవ సభ గురించి చెన్నూరులో వేసిన వాల్ రైటింగ్ ని మున్సిపల్ అధికారులు చెరిపేశారంటూ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ట్వీట్ చేశారు. దీనిపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు.
"కాంగీ కాకుల్లారా, మీరెన్ని కుట్రలు చేసినా ఏప్రిల్ 27న యావత్ తెలంగాణ వరంగల్ లో ఉండబోతోంది. ఆరోజు మిగిలేది కేవలం రేవంత్ రెడ్డి ఆయన అసిస్టెంట్లు మాత్రమే. గాంధీ భవన్ లో మా సభ లైవ్ చూస్తూ చక్కగా కాలక్షేపం చేసుకోండి" అని ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు.